Begin typing your search above and press return to search.

కరోనా అంటే ఏమిటి? ఎలా వృధ్ధి చెందుతుంది? ఎలా నివారించవచ్చు?

By:  Tupaki Desk   |   29 March 2020 3:30 AM GMT
కరోనా అంటే ఏమిటి? ఎలా వృధ్ధి చెందుతుంది? ఎలా నివారించవచ్చు?
X
కరోనా వైరస్ ..ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి వల్ల భయంతో వణికిపోతోంది. ఈ కరోనా ప్రాణము లేని వొక ప్రోటీన్ పదార్థపు కణము - దీని పైన క్రొవ్వు పదార్థము - ఒక పొరలా యేర్పడి - ఒక పౌడరులా వుంటుంది. అయితే - ఈ కరోనా కణం - ఇతర వాటిలా కాకుండా కొంత బరువు కలిగి వుండటంతో - ఈ వైరస్ గాలిలో ఎగురలేదు. ఎక్కువసేపు గాలిలో ఉండలేదు. భూమిపై పడిపోతుంది. ఇది నిర్జీవ కణం. ఒక స్త్రీ అండాశయం లో నిర్జీవ అండం ఎలా 14 రోజులు వుండి - వీర్య కణంతో జీవకణంగా మారి - కణ విభజన మొదలవుతుందో - ఈ కరోనా నిర్జీవ కణం కూడా 14 రోజులు నిర్జీవ కణంగానే వుండి - ఈ మధ్యలో ఎప్పుడైతే మానవుని శరీరంలోని చీమిడితో సంపర్కమవుతుందో - దానిలో కణ విభజన ఆరంభమవుతుంది. మన ముక్కులోని చీమిడిలో కల ప్రోటీన్ ధాతువులు దీనికి మూలాధారం.

మన కంటి కలక లేక పుసి కానీ - ముక్కులోని చీమిడి కానీ - నోటిలోని గళ్ళ కానీ దానికి దొరికితే వెంటనే నిముషాలలో కొన్ని వేల - లక్షలలో కణ విభజన జరిగి శ్వాస కోశాలలో చేరి - అక్కడి నుండి ఊపిరితిత్తులలోకి రక్తనాళాలను ఆక్రమించి మన శరీరానికి ప్రాణవాయువును నిరోధిస్తుంది. దీని కారణంగా, రోగి ప్రాణవాయువు అందక చాలా తక్కువ సమయంలోనే మరణిస్తాడు. కరోనా సోకిన రోగిష్టి తుమ్మినపుడూ - దగ్గినపుడూ - వారి చీమిడి ద్వారా - కఫము ద్వారా ఈ రోగ కణాలు ఎక్కడంటే - అక్కడ పడతాయి. కాబట్టి ఆ కరోనా సోకిన వ్యక్తి పక్కనే మనం వుంటే మనపై పడవచ్చు. లేక అవి తుంపరలుగా వేటిపైనన్నా పడివుంటే - ఆయా పదార్థ లక్షణములను బట్టి వాతావరణంలోని వేడిని స్వీకరించు సామర్థ్యాన్ని బట్టి అవి 4 గంటల నుండీ 24 గంటల వరకూ శక్తివంతమై ఉండగలవు. అంటే వేడికి దీనిపై వున్న క్రొవ్వు పొర కరగి పోయి నిర్వీర్యమైపోతుంది.

ఇకపోతే , ఇప్పటివరకు ఈ వ్యాధి విజృంభించిన దేశాలన్నీ దరిదాపు శీతల దేశాలే కావడం గమనార్హం. వేడి తక్కువ ప్రాంతాలు కావటంతో - దీనిపై గల క్రొవ్వు పొర కరగడానికి తక్కువ ఆస్కారం ఉండటం కూడా ఆ దేశాలలో అంతలా ప్రభావం చూపడానికి మరో కారణం. సాధారణం ఈ కరోనా సోకిన సమయంలో - ఆ వ్యాధి సోకిన వ్యకిని తాకితే ఆ కరోనా కణాలు మనకి కూడా పాకే అవకాశం ఉంది. ఆ తరువాత మన చేతులతో మన కళ్ళను -ముక్కును - నోటిని స్పర్శించడం సహజం. ఇలా యీ రోగ కణాలు ఎక్కడికైతే చేరకూడదో అచ్చటికి సులభంగా చేరిపోతాయి. ఒక్కసారి అవి మన కంటి కలకను కానీ - చిమిడిని లేక ముక్కులోని పొక్కులను కానీ - మన నోటిలోని గళ్ళను కానీ చేరాయో - ఇక వాటిని నిరోధించటం అసాధ్యం. ఇవి సర్వ సాధారణంగా అందరిలో ఎల్లవేళలా ముఖ్యంగా ముసలి వారిలో వుంటాయి కళ్ళ కలక ను చేరితే వెంటనే అది కంటి నీరుగా వృధ్ధి చెంది - ముక్కు ప్రక్కగా జారి - ముక్కు ద్వారా విజృంభిస్తుంది.

ఇకపోతే, ఈ కరోనాకి ఇప్పటివరకు సరైన మందు లేనప్పటికీ కూడా - కరోనా యొక్క కొన్ని బలహీనతలను ఆసరా చేసుకొని - కరోనా సోకిన వ్యక్తిని కాపాడవచ్చు. దీనికి రక్షక కవచం దీనిపైనున్న క్రొవ్వు పదార్ధం. ఈ క్రొవ్వు పదార్థాన్ని మనం తొలగించి నట్లయితే దీనిని నిర్వీర్యం చేయవచ్చు. సాధారణంగా క్రొవ్వు పదార్థం వేడికి కరగి పోతుంది. లేక 'సబ్బు' నురుగుకు కరగి పోతుంది. సర్వ సాధారణంగా మన ఇళ్లలో చేతికి కాని - పాత్రలకు కానీ పట్టిన జిడ్డును తొలగించడానికి మనం సబ్బు పదార్థాలు వాడుతాం. దీనికి కూడా అంతే. మన శరీరాన్ని - తల వెంట్రుకలతో సహా సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ నీటితో - బాగా నురుగు వచ్చే సబ్బుతో - రోజుకు 2-3 పర్యాయాలు బాగా తల స్నానం చేయడంతో మన శరీర భాగాలను అంటుకున్న ఈ కరోనా కణము పైగల క్రొవ్వు కరగి పోయి నిర్వీర్యమై పోతుంది. అటు తరువాత బాగా కొబ్బరి నూనెను శరీర భాగాలకు రుద్దుకుంటే - ఒకవేళ మన శరీర భాగాలపై ఈ రోగ కణాలు మళ్లీ పడ్డా - అందులో చిక్కుకుని బయటకు రాలేని స్థితి ఏర్పడుతుంది. దీనితో రోజుకి రెండు - మూడు సార్లు స్నానం చేయడం వల్ల ఈ కరోనా కణాలని నిర్వీర్యం చేయవచ్చు.

వీటి మధ్యలో అనేక సార్లు మన చేతులను 38 డిగ్రీలు అంతకన్నా ఎక్కువ వేడి నీటితో - బాగా నురుగు వచ్చే సబ్బుతో ఒక నిముషం పాటు శుభ్ర పరచుకుంటే - మనం ధరించే వస్త్రాలను - కర్చీఫులను - మాస్కులను పై లాగే శుభ్ర పరచుకుంటే, ఈ వ్యాధి కణాలపై వున్న క్రొవ్వును కరిగించి దానిని నిర్వీర్యం చేయవచ్చు. కానీ ఎట్టి పరిస్థితులలో కానీ ఈ కణం మన ముఖానికి చేరకూడదు. కంటి కలక తో కానీ - ముక్కు చీమిడి లేక పొక్కులతో కానీ - నోటి గళ్ళ తో కానీ సంపర్క మైతే దానిని అడ్డుకొనటం ఆ తరువాత దాదాపు అసాధ్యం. ఈ కారణంతోనే మనకి డాక్టర్లు పదే పదే చేతులు కడుక్కోవాలి అని చెప్తున్నారు. వారు చెప్పే ఉద్దేశం వెనుక అసలు కారణం ఇదే. కాబట్టి ఇకనైనా కూడా రోజులో వీలైనన్ని సార్లు చేతులు కడుక్కొని, ఈ వ్యాధి భారిన పడకుండా ఉండండి. అలాగే ప్రభుత్వ సూచనలు కూడా పాటించండి.