Begin typing your search above and press return to search.

బీజేపీలోకి టీడీపీ మాజీ మంత్రులు.. ఒక వైసీపీ నేత?

By:  Tupaki Desk   |   7 Aug 2020 10:50 AM GMT
బీజేపీలోకి టీడీపీ మాజీ మంత్రులు.. ఒక వైసీపీ నేత?
X
చంద్రబాబు చేజారిపోతున్నారు నేతలు. ఆయనపై విశ్వసనీయత కోల్పోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు బలి కాకూడదని వారంతా నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందుకే ఇద్దరు టీడీపీ మాజీ మంత్రులు సైకిల్ దిగి కమలదళంలో చేరబోతున్నట్టు తెలిసింది. మరో విశేషం ఏంటంటే.. అధికార వైసీపీ నేత ఒకరు కూడా అదేబాటలో బీజేపీలోకి చేరబోతున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

చంద్రబాబు జిమ్మిక్కులకు మేము బలి కాలేము అంటూ వైజాగ్ లో ఉన్న ఇద్దరు మాజీ మంత్రులు డిసైడ్ అయ్యారట... అందులో ఒక టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికే వైసీపీలోకి చేరబోతుండగా.. మరో టీడీపీ మాజీ మంత్రి బీజేపీలోకి చేరాలని డిసైడ్ అయ్యారట.. వీరి బాటలోనే ఒక వైసీపీ నేత కూడా బీజేపీ లో చేరడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం.

ఈ క్రమంలోనే మోడీని వీరుడు సూరుడు అంటూ టీడీపీ మాజీ మంత్రి పొగుడుతూ మెసేజ్లు ఇస్తున్నాడని రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. వైజాగ్ ను వ్యతిరేకిస్తున్న చంద్రబాబుకు వీళ్లు ఇద్దరు చెరో పార్టీకి జంప్ చేయడం ఖాయమని తెలిసిందని టాక్ నడుస్తోంది.