Begin typing your search above and press return to search.

రోశయ్య డైలాగ్ సంచలనం.. యూట్యూబ్ షేక్

By:  Tupaki Desk   |   4 Dec 2021 9:10 AM GMT
రోశయ్య డైలాగ్ సంచలనం.. యూట్యూబ్ షేక్
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. అది వైఎస్ఆర్ సీఎం అయిన రోజులు.. 2004లో రెండు సార్లు అధికారంలో ఉన్న చంద్రబాబు చిత్తుగా ఓడి ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఒంటిచేత్తో కాంగ్రెస్ ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి తీసుకొచ్చారు.

వైఎస్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా.. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పై మాటాల సందర్భంగా డ్రామాలేశాడని.. ఆయనది డ్రామా కంపెనీ అని ఎవరో ఎమ్మెల్యే అంటే రోశయ్య మాట కలిపాడు. డ్రామాలు వేసిన ఎన్టీఆర్ సీఎం అయ్యారు. పాలించాడని అన్నారు.

దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు భగ్గుమన్నారు. తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలచిన ఎన్టీఆర్ ను అంటావా? అని రోశయ్యనపై విరుచుకుపడ్డారు.ఆయన మంత్రిగా చేసిన పొరపాట్లు ఎత్తిచూపి ఎండగట్టారు. ముసోలోడు అయిపోతున్నావ్ కాస్త ఆవేశం తగ్గించుకో అంటూ హితవు పలికారు.

దీనికి రోశయ్య మైక్ అందుకొని రెచ్చిపోయారు. చంద్రబాబు టీడీపీ స్థాపించిన ఎన్టీఆర్ ను ముందు ఎంత గౌరవించాడో.. తర్వాత ఏం జరిగిందో.. ఇప్పుడు ఏలా గౌరవిస్తున్నాడో అందరికీ తెలుసు అంటూ ఆయన వెన్నుపోటును ప్రస్తావించారు. ఇక తనకు తెలివిలేదని.. కోపం కంట్రోల్ కావడం లేదన్న చంద్రబాబుకు గట్టి కౌంటర్ ను రోశయ్య ఇచ్చాడు.

నాకు నిజంగా కనుక తెలివి ఉంటే నాడు చెన్నారెడ్డిని.. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కత్తితో పొడిచి వారి కుర్చీ లాక్కునే వాడిని కదా అంటూ చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను నిండు సభలో మంచి పంచులతో ఉతికి ఆరేశాడు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.

కొణిజేటి రోశయ్య వ్యూహాల్లో, రాజకీయా చాణక్యాల్లో ప్రత్యర్థులను తన మాటలతో ముప్పుతిప్పలు పెట్టడంతో ఆరితేరిన మేధావి. ఆయన మాటల తూటాలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.