Begin typing your search above and press return to search.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కాల్పులు
By: Tupaki Desk | 10 Aug 2020 4:15 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఈ కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో ఒక యువకుడు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. క్రిస్టోఫర్ బ్రౌన్ అనే 17 ఏళ్లు యువకుడిగా గుర్తించారు.
ఈ కాల్పుల్లో మరో 19మంది తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి 12.20 గంటల సమయంలో గుమిగూడి ఉన్న వారి మీద ఎవరో గుర్తుతెలియని దుండగుడు పలుమార్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు.
ఇక ఓ పోలీస్ అధికారి కూడా ఈ కాల్పుల్లో గాయపడింది. ఆమె పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక మిగిలిన వారికి ప్రాణనష్టం వాటిల్లేలా బులెట్స్ తగలలేదు.
ఫుడ్, మ్యూజిక్ పెట్టుకొని కొందరు గుమిగూడి ఉన్నప్పుడు ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు చెప్పారు. సామూహిక వేడుకపై ఈ కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపింది ఎవరనేది తెలియాల్సి ఉంది.
ఈ కాల్పుల్లో మరో 19మంది తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి 12.20 గంటల సమయంలో గుమిగూడి ఉన్న వారి మీద ఎవరో గుర్తుతెలియని దుండగుడు పలుమార్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు.
ఇక ఓ పోలీస్ అధికారి కూడా ఈ కాల్పుల్లో గాయపడింది. ఆమె పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక మిగిలిన వారికి ప్రాణనష్టం వాటిల్లేలా బులెట్స్ తగలలేదు.
ఫుడ్, మ్యూజిక్ పెట్టుకొని కొందరు గుమిగూడి ఉన్నప్పుడు ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు చెప్పారు. సామూహిక వేడుకపై ఈ కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపింది ఎవరనేది తెలియాల్సి ఉంది.