Begin typing your search above and press return to search.

ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో మంటలు

By:  Tupaki Desk   |   21 May 2019 5:42 AM GMT
ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో మంటలు
X
ఆంధ్రప్రదేశ్ లోని ఓ కౌంటింగ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి మంటలు చెలరేగడం కలకలం రేపింది. మే 23 కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం అందరినీ షాక్ కు గురి చేసింది.

చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఈవీఎంలను భద్రపరిచిన ఎస్వీ సెట్ ఇంజీనీరింగ్ కళాశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. కేంద్రంలో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి కాలేజీకి చెందిన రెండు ఏసీలు, నాలుగు కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. ఏసీలోని షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు.

అయితే ఈవీఎంలు ఈ అగ్రిప్రమాదం జరిగిన దగ్గర్లోని రూములోనే అధికారులు స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. ఆ గదులకు వ్యాపించకుండా అధికారులు అప్పటికప్పుడు మంటలను ఆర్పివేయడంతో పెద్ద ముప్పు తప్పింది.

కౌంటింగ్ కు రెండు రోజుల ముందు అగ్ని ప్రమాదం సంభవించడంతో ఎన్నికల సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో పోలింగ్ ముందురోజు ఎన్నికల మానిటరింగ్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగగా.. ఇప్పుడు కౌంటింగ్ కేంద్రంలోనే మరోచోట తాజా ప్రమాదం చోటుచేసుకోవడంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. చిత్తూరు కలెక్టర్ ప్రద్యుమ్మ, ఎస్సీ విక్రాంత్ పాటిల్ సందర్శించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. .