Begin typing your search above and press return to search.

ఇంగ్లిషు మీడియం బిల్లు కు అసెంబ్లీ లో ఆమోదం !

By:  Tupaki Desk   |   23 Jan 2020 10:54 AM GMT
ఇంగ్లిషు మీడియం బిల్లు కు అసెంబ్లీ లో ఆమోదం !
X
రాష్ట్రం లోని పేదవాడికి మంచి జరగాలని బిల్లు ప్రవేశపెడుతుంటే టీడీపీ సభ్యులు ప్రతీసారి అడ్డుకుంటున్నారని సీఎం అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టేందుకు తీసుకువచ్చిన బిల్లును మండలిలో తిరస్కరించారని ఈ రోజు సభలో మాట్లాడుతూ గుర్తు చేశారు. అయితే , ఎవరెన్ని విధాలుగా అడ్డుకోవాలని చూసినా పేద పిల్లలకు ఈ జగన్‌ మామ తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పెట్టాలని రూపొందించిన బిల్లుకు శాసన సభ గురువారం మరోసారి ఆమోదం తెలిపింది. అదే విధంగా ఈ బిల్లుకు మండలి చేసిన సవరణలను తిరస్కరించింది.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను సభలో వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్ర వర్ణాల్లో పేదలకు ఇంగ్లీష్‌ విద్య అవసరం. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకువస్తున్నాం. ప్రాథమిక దశ నుంచే ఇంగ్లీషు లో చదువుకుంటే.. పై చదువులకు వెళ్లే సరికి మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రైవేటు పాఠశాలల్లో 95 శాతానికి పైగా ఇంగ్లీషు మీడియంలోనే బోధన జరుగుతోంది అని తెలిపారు.

అలాగే కంప్యూటర్‌ భాష కూడా ఇంగ్లీషులోనే ఉంటుంది అని , ఇంగ్లీష్ స్పష్టం గా మాట్లాడగలిగితేనే మెరుగైన జీతాలు వచ్చే పరిస్థితి ఉంది. పేదవాడికి రైట్‌ టు ఇంగ్లీష్‌ ఎడ్యుకేషన్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. గత సమావేశాల్లో బిల్లు తీసుకువస్తే టీడీపీ మండలిలో అడ్డుకుంది. పేదవాడికి మంచి జరుగుతుంటే ఆలస్యం చేయాలని వారు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎవరు ఎన్ని విధాలుగా అడ్డు పడినా పేద పిల్లలకు జగన్‌ మామ తోడుగా ఉంటాడు. మధ్యాహ్న భోజన పథకంలో గోరుముద్ద పేరుతో మెనూ తీసుకువచ్చాం. దాదాపు 36 లక్షల మంది విద్యార్థులకు జూన్‌లో విద్యా కానుక కిట్‌ అందిస్తాం అని తెలిపారు.