Begin typing your search above and press return to search.

భారత్ కి అది మంచిది కాదు .. జూనియర్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   19 Oct 2020 8:50 AM GMT
భారత్ కి అది మంచిది కాదు .. జూనియర్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు !
X
అమెరికా లో ఓ వైపు కరోనా వైరస్ ..మరోవైపు అధ్యక్ష ఎన్నికల వేడి హోరాహోరీగా సాగుతుంది. ఎన్నికల హడావిడిలో కరోనా సంగతి పూర్తిగా పక్కన పెట్టేసి , ప్రచారం పైనే నిమగ్నమైయ్యారు. మళ్లీ అధికారంలోకి రావాలని ట్రంప్ , ఈసారి ఎలాగైనా గెలవాలి అని బిడెన్ ..తమ వ్యూహాలని పక్కాగా అమలు చేస్తున్నారు. ఇకపోతే , తాజాగా డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ చైనా పట్ల వ్యవహరిస్తున్న ధోరణి భారత్ ‌కి అంత మంచిది కాదని‌ ట్రంప్‌ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ అన్నారు. లాంగ్‌ ఐలాండ్‌ లో జరిగిన బైడెన్‌ పై అవినీతి ఆరోపణల గురించి తను రాసిన 'లిబరల్‌ ప్రివిలేజ్‌' పుస్తకం విజయోత్సవ కార్యక్రమంలో జూనియర్‌ ట్రంప్‌ ఈ విధమైన కామెంట్స్ చేశారు.

చైనా ముప్పును మేము అర్థం చేసుకోగలము. బహుశా భారతీయ అమెరికన్లకన్నా దీని గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. ఈ రేసులో మీరు మా ప్రత్యర్థిని చూసినప్పుడు.. చైనీయులు బైడెన్‌ కు ఎన్నికల ప్రచార నిమిత్తం 1.5 బిలియన్ డాలర్లు ఇచ్చారు. ఎందుకంటే బైడెన్‌ గొప్ప వ్యాపారవేత్త. అతడిని ఎలాగైనా తమకు సానుకూలంగా మార్చుకోవచ్చనే చైనా భావిస్తోంది. బైడెన్‌ వైఖరి కూడా చైనా పట్ల ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుంది. ఇది భారత్‌ కు అంత మంచిది కాదు అని ఎన్నికల ప్రచారానికి నిధుల సేకరణకు నాయకత్వం వహిస్తున్న కింబర్లీ గిల్‌ఫోయిల్ ‌తో పాటు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలోనూ ఆయన ప్రసంగించారు. జూనియర్ ట్రంప్.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇకపోతే , అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3 న జరగనున్నాయి.