Begin typing your search above and press return to search.

నేడు సీఎం జగన్ కలవనున్న దివ్య తల్లిదండ్రులు !

By:  Tupaki Desk   |   20 Oct 2020 7:15 AM GMT
నేడు సీఎం జగన్ కలవనున్న దివ్య తల్లిదండ్రులు !
X
విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో అన్యాయంగా బలైపోయిన యువతి తల్లిదండ్రులు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో భేటీ కానున్నారు. హోం మంత్రి సుచరిత తో కలిసి సీఎం జగన్ ‌ను కలవనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో సీఎంను కలుస్తారు. సీఎంను కలిసే ఏర్పాటు చేయాలని రెండు రోజుల క్రితం పరామర్శించడానికి వెళ్లిన హోంమంత్రిని యువతి కుటుంబసభ్యులు కోరారు. యువతి తల్లిదండ్రుల విజ్ఞప్తితో సీఎంను కలిసేందుకు మంత్రి ప్రత్యేకంగా చొరవ చూపారు. దీంతో యువతి పేరెంట్స్ ‌ను కలవడానికి ఈ రోజు మధ్యాహ్నం సీఎం క్యాంప్ ఆఫీస్‌ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.హోమ్ మంత్రి సమక్షంలో కలిసి జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నారు యువతి తల్లిదండ్రులు

కాగా, విజయవాడ బీటెక్ విద్యార్థిని యువతి మర్డర్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిందుతుడు, యువతి వివాహం చేసుకున్నట్లు ఉన్న ఫొటో మార్ఫింగ్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. యువతి అంత్యక్రియలు జరిగిన ప్రాంతానికి యువతి స్పెషల్ విభాగం ఆఫీసర్ దీపికా పాటిల్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ కేసును మాచవరం పోలీసుల నుండి దిశా పోలీస్ స్టేషన్ కి ఫార్వర్డ్ చేశారు. ఈ కేసు దిశా పోలీస్ స్టేషన్ దర్యాప్తు చేపట్టారు. యువతి స్నేహితులను విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆమె తీసిన సెల్పీ వీడియోలో చెప్పిన వ్యక్తి ఎవరు అనే కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నారు. యువతి ఇన్ ‌స్టాగ్రామ్‌ లైవ్‌ లో చివరి సారిగా మాట్లాడిన ఓ వీడియో కీలకంగా మారింది. తాను ఓ సైకోతో పోరాడుతున్నానని, అతను తన జీవితం నాశనం చేయాలని చూశాడని ఆ వీడియోలో చెప్పుకుంది. ఈ సమయంలో యువతి పేరెంట్స్‌ సీఎంతో భేటీ కానున్నారు. యువతి హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దూకుడుగా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న పోలీసులు.