Begin typing your search above and press return to search.

ఎన్ కౌంటర్ పై స్పందించిన దిశ తల్లి

By:  Tupaki Desk   |   6 Dec 2019 7:37 AM GMT
ఎన్ కౌంటర్ పై స్పందించిన దిశ తల్లి
X
దిశ పై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులు ఈ ఉదయం పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా తన కూతురును చంపిన నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ లో హతమవ్వడం పై దిశ తల్లి స్పందించారు. దిశకు న్యాయం జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు. 9 రోజుల్లోనే దిశకు న్యాయం చేశారని తెలిపారు.

దిశ తల్లి మాట్లాడుతూ ‘‘ఏడు సంవత్సరాలైనా ఢిల్లీ లో నిర్భయకు న్యాయం జరగలేదు. మీడియా కు పోలీసులకు ధన్యవాదాలు. మా అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరింది. నిందితుల ఎన్ కౌంటర్ తో మాకు మనశ్శాంతి కలిగింది. ఇంత తొందరగా న్యాయం జరుగుతుందని ఊహించ లేదు. నిందితుల శవాలను చూడాలని ఉంది. మా అమ్మాయి లేదన్న విషయాన్ని తట్టుకో లేకపోతున్నానని’ తెలిపింది.