Begin typing your search above and press return to search.

ఢిల్లీ జోరు.. ఇంత తగ్గిందేంటి? ఒక్కటంటే ఒక్కసిక్స్​ లేదు..!

By:  Tupaki Desk   |   16 April 2021 10:30 AM GMT
ఢిల్లీ జోరు.. ఇంత తగ్గిందేంటి? ఒక్కటంటే ఒక్కసిక్స్​ లేదు..!
X
ఐపీఎల్ అంటేనే పరుగుల వరద, సిక్సర్ల మోత. అప్పుడే ప్రేక్షకులకు ఓ ఊపు, ఉత్సాహం వస్తాయి. బ్యాట్స్​మెన్​ ఎప్పుడెప్పుడు సిక్స్​ లు కొడతాడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇటువంటి టైంలో మ్యాచ్​ ఎంత స్లోగా సాగుతుంటే ప్రేక్షకులు అంత నిరాశలో మునిగిపోతారు. నిన్న సరిగ్గా అటువంటిదే జరిగింది. నిన్నటి మ్యాచ్​ లో రాజస్థాన్​ రాయల్స్​తో ఢిల్లీ జట్టు తలపడింది. ఢిల్లీ పటిష్ఠమైన జట్టు. బౌలింగ్​ విషయంలో ఎంతో మెరుగ్గా ఉంది. గత సీజన్​ లో ఫైనల్​ వరకు చేరుకున్నది. అంతేకాక రిషబ్​ పంత్​, శిఖర్​ ధావన్​ లాంటి బ్యాట్స్​మెన్లు ఉన్నారు.

ఇక బౌలింగ్​, ఫీల్డింగ్​ లో ఆ జట్టుకు తిరుగులేదు. మరోవైపు ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్​ రికీ పాంటింగ్​ ఈ జట్టుకు హెడ్​ కోచ్​ గా ఉన్నాడు. దీంతో ఢిల్లీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తుంది. అయితే నిన్నటి మ్యాచ్​ లో మాత్రం ఢిల్లీ జట్టు ప్రేక్షకుల ఉత్సాహాన్ని ఎంతో నీరుగార్చింది. శిఖర్​ ధవన్​ అవుట్​ కాగానే రన్​రేట్​ దారుణంగా పడిపోయింది.రిషబ్​ పంత్​ కాసేపు పోరాడినప్పటికీ భారీ స్కోరు చేయలేకపోయాడు. ఢిల్లీ ఇన్సింగ్స్​ మొత్తంలో ఒక్క సిక్స్​ కూడా కొట్టలేదు.

నిన్నటి మ్యాచ్​ వేదిక ముంబైలోని వాంఖడే స్టేడియం. వాంఖడే స్టేడియం అంటేనే పరుగులు మోత ఉంటుంది. కానీ ఢిల్లీ బ్యాట్స్​మెన్​ పెద్దగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. అయితే ఇప్పటివరకు వాంఖడే స్టేడియంలో ఒక్క సిక్స్​ కూడా కొట్టని టీం ఏదీ లేదు. అంతేకాక రిషబ్​ పంత్​ 50 పరుగులు చేసినప్పటికీ ఒక్క సిక్స్​ కూడా కొట్టకపోవడం గమనార్హం. దీంతో ఫ్యాన్స్​ తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ఈ మ్యాచ్​లో ఢిల్లీ పరాజయం పాలైంది.