Begin typing your search above and press return to search.

మొండిగా ఎన్నికలకు వెళితే ప్రమాదమే.. కేరళ నేర్పుతున్న పాఠం ఇదే..!

By:  Tupaki Desk   |   16 Jan 2021 9:28 AM GMT
మొండిగా ఎన్నికలకు వెళితే ప్రమాదమే.. కేరళ నేర్పుతున్న పాఠం ఇదే..!
X
ఏపీలో ఎట్టిపరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని ఎన్నికల కమిషనర్​ నిమ్మగడ్డ రమేశ్​ పట్టుబడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గలేదని.. కొత్త స్ట్రెయిన్​ కలకలం సృష్టిస్తున్నదని.. వ్యాక్సినేషన్​ ప్రక్రియ కూడా మొదలైందని ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్ళలేం అని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్​ను విడుదల చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లగా హైకోర్టు ఎన్నికల షెడ్యూల్​ను కొట్టేసింది. అయితే కమిషనర్ నిమ్మగడ్డ మళ్లీ డివిజన్​ బెంచ్​లో అప్పీల్​కు వెళ్లారు. ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఎన్నికలు పెట్టడం కుదరదని చెబుతున్నది.

అయితే ఇటీవల కేరళ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగాక కరోనా కేసులు పెరిగాయి. కేరళలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అక్కడ ఎల్డీఎఫ్​ విజయం సాధించింది. అయితే ఎన్నికలకు ముందు కేరళలో కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఎన్నికల పూర్తయ్యాక అక్కడ.. రోజుకు 6 వేల కేసులు నమోదవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని అక్కడి అధికారులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్​తో పోల్చుకుంటే కేరళ రాష్ట్రంలో అక్షరాస్యత శాతం ఎక్కువ. అక్కడా చాలామంది విద్యాధికులే ఉంటారు. కరోనాపై పూర్తిస్థాయి అవగాహన ఉంటుంది అక్కడి ప్రజలకు. అయినప్పటికీ కరోనా విస్తరించింది.

అటువంటిది ఆంధ్రప్రదేశ్​లో పంచాయతీ ఎన్నికల నిర్వహిస్తే కరోనా విస్తరించే ప్రమాదం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. కేరళలోనే ఆ స్థాయిలో విస్తరిస్తే ఇక ఏపీలో అంతకంటే ఎక్కువ కేసులే వస్తాయని వాళ్లు అంటున్నారు. ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వెనక్కి తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.