Begin typing your search above and press return to search.

లేటెస్ట్ అప్డేట్ : దేశంలో 19 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

By:  Tupaki Desk   |   5 Aug 2020 8:30 AM GMT
లేటెస్ట్ అప్డేట్ : దేశంలో 19 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
X
భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం ప్రకటించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌ లో 52,509 మందికి కొత్తగా కరోనా వైరస్ నిర్దారణ అయింది. అదే సమయంలో 857 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీనితో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 19,08,255కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 39,795కి పెరిగింది. 5,86,244 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 12,82,216 మంది కోలుకున్నారు. రికవరీ రేటు ఇండియాలో 67.2 శాతానికి చేరింది. ఇది శుభపరిణామం.

ఇకపోతే , కాగా, నిన్నటి వరకు మొత్తం 2,14,84,402 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్కరోజులో 6,19,652 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. కాగా, తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 2,012 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,139 మంది కోలుకోగా, 13 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 70,958కి చేరింది. ఆసుపత్రుల్లో 19,568 మందికి చికిత్స అందుతోంది.

ఇక, ఏపీలో కరోనా మరణాల ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 9,747 పాజిటివ్ గా నిర్దారణ అయింది. అలాగే ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 67 మంది మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 1,604కి పెరిగింది. అలాగే, ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,76,333కి చేరింది.