Begin typing your search above and press return to search.

కరోనాతో చనిపోతే ఏం చేస్తారు? తెలంగాణ మార్గదర్శకాలివీ

By:  Tupaki Desk   |   9 April 2020 5:00 AM GMT
కరోనాతో చనిపోతే ఏం చేస్తారు? తెలంగాణ మార్గదర్శకాలివీ
X
మామూలుగా చనిపోతే ఖననం చేస్తారు. కొందరు కాలేస్తారు.. మరికొందరు భూమిలో పాతిపెడతారు. ఆయా మత సంప్రదాయల ప్రకారం ఈ ఖననం ఉంటుంది. అయితే ఇప్పుడు కరోనాతో చనిపోయిన శవాలను ఏం చేయాలనే దానిపై పీఠముడి నెలకొంది.

ఎందుకంటే కరోనాతో చనిపోయిన శవాల్లో వైరస్ ఉంటుంది. దాన్ని బయటకు వ్యాపించకుండా పకడ్బందీగా ప్యాకింగ్ చేసి డిస్ మాటిల్ చేయాలి. అయితే హిందూ,ముస్లిం, క్రైస్తవ మతాచారాల ప్రకారం.. ఖననం విభిన్నంగా ఉంటుంది. హిందువులు మెజార్టీ శవాలను అగ్నికి ఆహుతి చేస్తారు. ముస్లింలు పెట్టెలో పెట్టి భూమిలో పాతిపెడతారు. క్రైస్తవులు భూమిలోనే పెట్టేలో పెట్టి ఖననం చేస్తారు. ఈ మూడు సంప్రదాయాలకు విలువనిస్తూ తాజాగా తెలంగాణ సర్కారు కరోనా తో చనిపోతే మార్గదర్శకాలను జారీ చేసింది.

ఏప్రిల్ 1న కరోనా మృతదేహాలను ఏం చేయాలనే దానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు కమిటీ ఏర్పాటు చేసింది. అన్ని మతాల విషయంలో కరోనా మృతదేహాల నిర్వహణ తప్పనిసరిగా ఒకే విధంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణలో కరోనాతో 11 మంది మరణించారు. అందులో ఒకరు ముస్లింమేతరుడు.మిగతా వారిలో మెజార్టీ ముస్లింలే.. ఈ నేపథ్యంలో మత సంప్రదాయం ప్రకారం ఖననం చేయడానికి తెలంగాణ సర్కారు మార్గదర్శకాలు జారీ చేసింది.

*తెలంగాణ సర్కారు విడుదల చేసిన మార్గదర్శకాలివీ..
*కరోనాతో మరణిస్తే ఆసుపత్రి వాహనాల్లో నియమించిన వ్యక్తులతో మృతదేహాలను ప్యాకింగ్ చేస్తారు. శ్మశానవాటికకు తరలిస్తారు.
*కేవలం ఐదుగురు కుటుంబ సభ్యులకు మాత్రమే ఖననం వేళ అనుమతి ఉంటుంది.
*మృతదేహాల ఖననాన్ని వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వమే పకడ్బందీగా నిర్వహిస్తుంది.
*హిందూ కరోనా మృతదేహాలను దహనం చేస్తారు.
*ముస్లిం, క్రైస్తవ మృతదేహాలను వారి మత ఆచారం ప్రకారం ఖననం చేస్తారు.