Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్: డబ్బు కూడా దొరకదా?

By:  Tupaki Desk   |   18 April 2021 2:30 PM GMT
కరోనా ఎఫెక్ట్: డబ్బు కూడా దొరకదా?
X
కాదెవరు కరోనాకు అనర్హం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. కరోనా ప్రబలుతుందని అందరూ ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఇంత పెద్ద దేశానికి 135 కోట్ల భారతానికి తిండి ఎవరు పెడుతారు? డబ్బులు లేనిదే.. రైతులు పండించనిదే తినడానికి తిండే ఉండదు.

అంతేకాదు.. ఇప్పుడు కరెన్సీ కొరత కూడా అనివార్యంగా మారడం ఖాయమన్న ప్రచారం మొదలైంది. ఎందుకే కరోనా ఎఫెక్ట్ కరెన్సీ ఉత్పత్తిపైనా పడుతోంది.

మహారాష్ట్రలో కరోనా తీవ్రంగా ఉంది. ప్రతిరోజు కొన్ని వేల కేసులు నమోదవుతున్నాయి. అదే స్థాయిలో చనిపోతున్నారు. దీన్ని నియంత్రించడం మహారాష్ట్ర సర్కార్ వల్ల కావడం లేదు. అందరూ కరోనా బారిన పడి.. లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంటున్నారు. బయటకు కాలు పెట్టడం లేదు.

ఈ ఎఫెక్ట్ నాసిక్ లోని కరెన్సీ సెక్యురిటీ ప్రెస్, ఇండియా సెక్యూరిటీ ప్రెస్ పై కూడా పడింది. దేశానికి సంబంధించిన కరెన్సీ ప్రింట్ చేసే సిబ్బందికి తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. చాలా మందికి సోకింది. దీంతో నాసిక్ లోని భారత కరెన్సీని ప్రింట్ చేసే రెండు భారత ప్రభుత్వ ప్రెస్ లను మూసివేశారు. ఈ నెల 30వేతదీ వరకు ఇది మూతపడనుంది. ఈ రెండు ప్రెస్ లలో 3వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఈ రెండు కీలకమైన ప్రెస్ ల మూతతో దేశంలో కరెన్సీ ప్రింటింగ్ ఆగిపోయి డబ్బుకు కొరత తీవ్రం కానుంది. దేశం మొత్తం చలామణీ అయ్యే కరెన్సీ నోట్లలో 40శాతం నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ లలోనే తయారవుతాయట.. ఒక్కసారిగా 40శాతం ప్రింటింగ్ ఆగిపోతే ఇక దేశంలో కరెన్సీ కొరత తీవ్రం కావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.