Begin typing your search above and press return to search.

లోకేష్ కోసం ఇంత పెద్ద ప్లాన్ వేసిన చంద్రబాబు?

By:  Tupaki Desk   |   20 April 2021 6:30 AM GMT
లోకేష్ కోసం ఇంత పెద్ద ప్లాన్ వేసిన చంద్రబాబు?
X
తెలుగుదేశంలో ఒకతరాన్ని అంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? వృద్ధ నేతలను.. ఆఖరుకు చంద్రబాబును సైతం సైడ్ చేసేలా మార్పులు రాబోతున్నాయా? సీనియర్లతో ఇక టీడీపీ రాజకీయం నడవదా? గొప్ప మార్పుకు తెలుగు దేశం పార్టీ సిద్ధమవుతుందా? అంటే టిడిపి పరిశీలకులు ఔననే అంటున్నారట.. పార్టీ పాత తరం నాయకులను పక్కనపెట్టి కొత్త నేతలకు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని టీడీపీ నిర్ణయించినట్టు భోగట్టా.. కొత్త ముఖాలను టీడీపీ ఆశిస్తున్నారని.. కొత్త తరం నాయకులు పాత నాయకులను భర్తీ చేయాలని అధిష్టానం డిసైడ్ చేసిందని ప్రచారం సాగుతోంది.

టిడిపిలో చాలా మంది నాయకులు 70 ఏళ్లకు దగ్గరగా ఉన్నారు. పార్టీ ఇప్పుడు వృద్ధ నేతలతో నడపలేకపోతోంది.. పలువురు నాయకులు తీవ్రంగా ప్రచారం చేయలేరు. ఆందోళనలకు రోడ్డెక్కలేరు. కాబట్టి పార్టీలో యువ రక్తం కోసం తీవ్రమైన కసరత్తు నడుస్తోందట.. కానీ సమస్య ఏమిటంటే కొత్త నాయకులు పార్టీలో చేరడం లేదు. సీనియర్ నాయకుల స్థానంలో పిల్లలు, పాత నాయకుల బంధువులు అందరూ భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

వచ్చే ఎన్నికల నాటికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన కొడుకును తెరపైకి తీసుకురావడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మాగంటి కుటుంబం కూడా అదే పనిలో ఉంది. రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తన సోదరుడి కొడుకును ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన కుమార్తెను రాజకీయాల్లో ముందుకు తెచ్చేందుకు సిద్ధమయ్యారు. రాయపాటి, కోడెల, యరపతినేని శ్రీనివాస రావు, జి.వి.జంజనేయులు, కొమ్మలపాటి శ్రీధర్ వంటి ముఖ్య నాయకులను 2024 కనమరుగై వారి వారసులు రాజకీయాల్లోకి రానున్నారు.

పరిటాల కుటుంబానికి చెందిన శ్రీరామ్, జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు, కె.ఇ.కృష్ణమూర్తి పిల్లలు కూడా చురుకుగా మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కొందరు 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. వారి సంఖ్య 2024లో పెరిగే అవకాశం ఉంది. కొందరు యువ నాయకులను ముందుకు నెట్టడం ద్వారా యువ జగన్ మోహన్ రెడ్డితో పోరాడటానికి సహాయపడుతుందని కొందరు అంటున్నారు. ఇంకా మరికొందరు ఇది నారా లోకేష్‌కు యువతంత్రానికి అడ్డురాకుండా అందరూ యువతను తీసుకొచ్చే చంద్రబాబు మార్గం అని అంటున్నారు. ఈ యువ నాయకులందరూ లోకేష్ బాబుకు విధేయులుగా ఉంటారని.. అందుకే బాబు ఈ స్కెచ్ వేశారని అంటున్నారు.