Begin typing your search above and press return to search.

ఏపీ డీజీపీకి చంద్ర‌బాబు ఘాటు లేఖ‌.. ఏమ‌న్నారంటే

By:  Tupaki Desk   |   25 Jun 2022 9:30 AM GMT
ఏపీ డీజీపీకి చంద్ర‌బాబు ఘాటు లేఖ‌.. ఏమ‌న్నారంటే
X
ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాజాగా ఏపీ డీజీపీ క‌సిరెడ్డి వెంక‌ట రా జేంద్ర‌నాథ్‌రెడ్డికి ఘాటు లేఖ రాశారు. ప‌చ్చిగ‌డ్డికి.. గంజాయికి తేడా లేదా? అని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం పై ఉద్య‌మిస్తున్న‌వారి ఇళ్ల‌లో ప‌చ్చిగ‌డ్డి వేసి.. దానినే గంజాయి అని ప్ర‌చారం చేసి కేసులు న‌మోదు చేస్తున్నార‌ని.. చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. ఈ ప‌రిణామాల‌ను చూస్తూ.. ఊరుకునేది లేద‌ని..ప్రైవేటు కేసులు వేస్తామ‌ని.. హెచ్చ‌రించారు.

కటారి అనురాధ దంపతుల హత్యకేసు విచారణలో పోలీసులు జాప్యం చేస్తున్నారని.. చంద్రబాబు లేఖలో మండిప‌డ్డారు. హత్యకేసులో కీలక సాక్షి అయిన సతీష్ వివరాల కోసం ప్రసన్న అనే వ్యక్తిని వేధించి.. ప్రసన్న సోదరుడు పూర్ణ ఇంటిపై దాడిచేశారని.. సాక్షులను బెదిరిస్తున్న స్థానిక పోలీసులపై ఉన్నతాధికా రులు చర్యలు తీసుకోవాలని కోరారు.

నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరినా.. చర్యలు తీసుకోకుండా సాక్షులను బెదిరిస్తున్నార ని చంద్ర‌బాబు మండిపడ్డారు. కీలక సాక్షి అయిన సతీష్ వివరాల కోసం ప్రసన్న అనే వ్యక్తిని వేధించి.. ప్రసన్న సోదరుడు పూర్ణ ఇంటిపై దాడిచేశారని పేర్కొన్నారు.

పోలీసులే పచ్చిగడ్డి తెచ్చి.. పూర్ణ ఇంట్లో గంజాయి ఉందంటూ అరెస్టు చేశారని ఆక్షేపించారు. అడ్డుకున్న మాజీ మేయర్ హేమలతపై దారుణంగా వ్యవహరించారన్నారు.

హేమలతపై జీపు ఎక్కించడం వల్ల తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యిందన్నారు. పూర్ణపై అక్రమ కేసు పెట్టి.. హేమలత పట్ల కర్కశంగా వ్యవహరించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అధికార పార్టీ మెప్పుకోసం.. సాక్షులను బెదిరిస్తున్న స్థానిక పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగేలా చర్యలు ఉండాలని చంద్ర‌బాబు సూచించారు.