Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఫ్లైటెక్కనున్న బాబు.... జగన్ మీద గట్టిగానే...?

By:  Tupaki Desk   |   18 Aug 2022 2:30 AM GMT
ఢిల్లీ ఫ్లైటెక్కనున్న బాబు.... జగన్ మీద గట్టిగానే...?
X
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బాట పట్టనున్నారా అంటే అవును అనే ప్రచారం సాగుతోంది. ఈ మధ్య బొత్తిగా ఢిల్లీ రావడం తగ్గించేశారు అంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశం సందర్భంగా మోడీ బాబుతో అన్నారని టీడీపీ అనుకూల మీడియ విపరీతంగా ప్రచారం చేసింది. దానికి బలమిచ్చేలా చంద్రబాబు మరిన్ని ఢిల్లీ యాత్రలకు బాబు రెడీ అయిపోతున్నారుట.

వీలైతే అతి త్వరలోనే చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్తారు అని ప్రచారం సాగుతోంది. ఈసారి టూర్ లో ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాను ప్రత్యేకంగా కలుస్తారు అని అంటున్నారు. ఈ అపాయింట్మెంట్ల కోసమే టీడీపీ ఇపుడు చాలా ప్రయత్నాలు చేస్తోంది అని అంటున్నారు.

అవి కనుక ఖరారు అయితే చంద్రబాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేయడం ఖాయమని అంటున్నారు. ఇక మోడీ కూడా ఈసారి కలుద్దామని చెప్పడంతో కచ్చితంగా ప్రధాని అపాయింట్మెంట్ లభించి తీరుతుంది అని కూడా టీడీపీ వర్గాలు విశ్వాసంతో ఉన్నాయి. కేంద్రంలో బీజేపీకి మిత్రులు కరవు అవుతున్న నేపధ్యం ఉంది. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ఎన్డీయేకు రామ్ రామ్ పాడేశారు.

దాంతో ఉన్న మిత్రులు పోతున్నారు కొత్త మిత్రులు రావడంలేదు. దాంతో మిత్రులను పెంచుకోవాల్సిన ఆవశ్యకత బీజేపీ మీద ఉంది. నితీష్ విపక్షం వైపు రావడంతో అక్కడ బలం పెరుగుతుందని బీజేపీ ఊహిస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు లాంటి రాజకీయ వ్యూహకర్త తమ వైపు ఉంటేనే మేలు అని కూడా కేంద్ర పెద్దలు భావించినా భావిస్తారు. అందుకే ఈ లెక్కలు అన్నీ సరిచూసుకునే బాబు ఢిల్లీ టూర్ ఈసారి పెట్టుకుంటున్నారు అని తెలుస్తోంది.

ఇక బాబు ఢిల్లీ వెళ్ళి ప్రధాని, అమిత్ షాలను కలిసేది వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తును కలుపుకునే యత్నం ఒకటి అయితే అదే టైం లో ఏపీలో జగన్ని బీజేపీకి దూరం చేసేందుకు కూడా వ్యూహం పన్నుతారు అని అంటున్నారు. ఇక ఏపీలో మూడేళ్ళ వైసీపీ సర్కార్ మీద టీడీపీ అనేక ఫిర్యాదులను ఇప్పటికే చేసింది. వాటిని అన్నిటికీ ప్రధాని, హోం మంత్రులకు చూపించడం ద్వారా ఏపీ సర్కార్ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతారు అని అంటున్నారు.

అలాగే ఏపీలో టీడీపీ కార్యకర్తలు సానుభూతిపరుల మీద అధికార పార్టీ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని, శాంతిభద్రతలు కూడా ప్రశార్ధకంగా మారాయని టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది. ఇపుడు దాన్ని కూడా కేంద్రానికి ఫిర్యాదు చేయడం ద్వారా జగన్ని ఇరకాటంలో పెట్టాలని బాబు చూస్తారు అంటున్నారు. మొత్తానికి మోడీ షాలతో చంద్రబాబు భేటీ అయితేనే వైసీపీ మైండ్ బ్లాంక్ అవుతుందని, ఆ మీదట కధ తాము నడిపిస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. సో చంద్రబాలు కాలు బయటపెట్టి ఉంచారు. ఏ క్షణాన అయినా ఆయన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేందుకు రెడీగా ఉన్నారు. మరి మోడీ షా అపాయింట్మెంట్స్ బాబుకు ఈసారి దొరికేనా. ఏమో చూడాలి.