Begin typing your search above and press return to search.

బాబు జీవితంలో ఎప్పుడూ చూడనివి ఇప్పుడే చేశారట

By:  Tupaki Desk   |   23 Feb 2021 11:30 AM GMT
బాబు జీవితంలో ఎప్పుడూ చూడనివి ఇప్పుడే చేశారట
X
టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఆక్రోసిస్తున్నారు. రాజకీయం గురించి కొత్తగా ఆయన తెలుసుకోవాల్సిందేమీ లేదు. ఆ మాటకు వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో పోల్ మేనేజ్ మెంట్ మొదలు.. ఎన్నో దరిద్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఆయన్ను చెబుతుంటారు. పార్టీ ఫిరాయింపులు మాత్రమే కాదు.. ఒక పార్టీకి చెందిన వారిని మరో పార్టీలోకి తీసుకురావటం మొదలు.. ఎన్నికల వేళ చిత్రవిచిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఆయన పేరును తరచూ ప్రస్తావనకు వస్తూ ఉంటుంది.

అలాంటి ఆయనకు తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై మాత్రం ఆయన విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపులో ఇన్ని అక్రమాలు తన రాజకీయ జీవితంలో తొలిసారి చూశానని ఆయన చెప్పారు. ఎన్నో వేధింపులు.. హింసలు గురైనా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పోరాడారని.. వారి పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వారిని వేధింపులకు గురి చేశారన్నారు. అలాంటి వారంతా ఎంతగానో పోరాడారని.. అలాంటి వారందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ఓట్ల లెక్కింపు సమయంలో ఉన్నట్లుండి కరెంటు పోవటం.. ఓట్ల లెక్కింపు కేంద్రంలో మాత్రమే కరెంటు ఎందుకు పోతుందన్న ప్రశ్నను ఆయన సంధించారు. డబ్బు.. అధికారదుర్వినియోగం.. అడుగడుగునా అక్రమాలతో మాత్రమే వైసీపీ గెలిచిందన్నారు. పంచాయితీ ఎన్నికల్ని యుద్దంలా చేయాల్సి వచ్చిందని.. అర్థరాత్రి వేళలోకూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయ తలుపుల్ని తట్టాల్సి వచ్చిందన్నారు. మొత్తంగా.. తన పొలిటికల్ కెరీర్ లో ఇలాంటి ఎన్నికల్ని.. ఓట్ల లెక్కింపును ఎప్పుడూ చూడలేదన్న బాబు మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.