Begin typing your search above and press return to search.

మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం గుండెని తడిమేసింది: చంద్రబాబు

By:  Tupaki Desk   |   12 Aug 2020 5:15 AM GMT
మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం గుండెని తడిమేసింది: చంద్రబాబు
X
ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) బయట ఓ మృతదేహం రెండు రోజులుగా పడి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని, దీంతో చివరకు ఆ డెడ్ బాడీనీ కుక్కలు పీక్కుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషాధకర ఘటనపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ అకౌంట్‌ లో పోస్ట్ చేశారు.

కుక్కలు ఆ మృతదేహం శరీరభాగాల్ని పీక్కుతున్నాయని, సాటి మనిషికి ఇచ్చే గౌరవం ఇదేనా, ఇది దారుణమైన నిర్వహణ వైఫల్యం, దీనిని ఖండించేందుకు కూడా నాకు మాటలు రావడం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఘటన గుండెని తడిమేస్తోందని, 2 రోజులుగా అక్కడే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.

అయితే ఈ ఆరోపణలను ఒంగోలు వన్ టౌన్ పోలిస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భీమా నాయక్ ఖండించారు. ఆ పేషెంట్ పేరు రాధాకృష్ణ రెడ్డి అని, ఆయన ఆగస్ట్ 8వ తేదీన ఆసుపత్రిలో చేరాడని, ఆ తర్వాత ఆగస్ట్ 9 రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అతను ఆ రోజు రాత్రి ఆసుపత్రి మూడో ఫ్లోర్ నుండి కిందకు దూకాడని, దీనికి సంబంధించి కేసు కూడా నమోదయిందని, పోస్టుమార్టం కూడా ఆసుపత్రిలోనే జరిగిందని, ఆ తర్వాత ఆ బాడీని బంధువులకు కూడా అప్పగించినట్లు తెలిపారు. బంధువులు మృతదేహాన్ని తీసుకు వెళ్లారని, కాబట్టి కుక్కలు ఆ బాడీని పీక్కుతినే ఆస్కారమే లేదన్నారు.