Begin typing your search above and press return to search.

ఏపీకి పోల‌వ‌రం సెగ‌: నిధులపై కేంద్ర మ‌రో వాద‌న‌

By:  Tupaki Desk   |   30 Nov 2021 2:30 AM GMT
ఏపీకి పోల‌వ‌రం సెగ‌:  నిధులపై కేంద్ర మ‌రో వాద‌న‌
X
పోల‌వ‌రం ప్రాజెక్టు వివాదం ఎడ‌తెగ‌కుండా సాగుతోంది. నిధులు ఇప్ప‌టికే ఖ‌ర్చు చేశామ‌ని.. వాటిని ఇవ్వా ల‌ని ఏపీ ప్ర‌భుత్వం కోరుతుంటే.. మీరు ఎంత ఖ‌ర్చు పెట్టినా.. మేం ఇచ్చేదే ఇస్తాం అంటూ.. కేంద్ర ప్ర‌భు త్వం వాద‌న‌కు దిగుతోంది. తాజాగా ఈ విష‌యం రాజ్య‌స‌భ‌కు చేరింది. తాజాగా దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పింది.

పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ పనులకు సంబంధించి అక్టోబర్‌ 21, 2021 నాటికి ఉన్న 2,087 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ)ను కోరగా 711 కోట్ల రూపాయల విడుదలకు మాత్రమే పీపీఏ సిఫార్సు చేసినట్లు కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనుల కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును తిరిగి చెల్లించే విషయంలో అసాధారణ జాప్యం జ‌రుగుతోంద‌ని.. దీనిని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నార‌ని.. వైసీపీ నాయ‌కుడు, ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వక స‌మాదానం వ‌చ్చింది

బిల్లుల స్క్రూటినీలో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం కోరవలసి రావడం, నియమ నిబంధ నలను రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అనుసరిస్తోందా లేదా వంటి అంశాల నిర్ధారణ వంటి పలు కారణాల వలన బకాయిల చెల్లింపులలో జాప్యం జరుగుతున్నట్లు కేంద్రం వివరించారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఇరిగేషన్‌ విభాగం పనులకు సంబంధించిన ఖర్చును 2014 ఏప్రిల్‌ నుంచి తిరిగి చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలవరం పనుల బిల్లులను పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలించిన అనంతరం చెల్లింపుల కోసం సిఫార్సు చేస్తుంది.

వాటిని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపిస్తారు. ఆర్ధిక శాఖ ఆమోదం పొందిన అనంతరం ఎంత మొత్తం బకాయిల చెల్లింపునకు ఆమోదం లభిస్తే ఆ మేరకు నిధులను నాబార్డ్‌ మార్కెట్‌ నుంచి సేకరిస్తుం ది. మార్కెట్‌ నుంచి నిధుల సేకరణ ప్రక్రియ పూర్తి కావడానికి సాధారణంగా రెండు నుంచి మూడు వారాలు పడుతుంది. సేకరించిన నిధులను నాబార్డ్‌ నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీకి అక్కడి నుంచి పీపీఏ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి బదిలీ అవుతాయి. నిధుల బదిలీ ప్రక్రియ సాధారణంగా ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుందని కేంద్రం తెలిపింది. అయితే.. పీపీఏ చేతిలోనే మొత్తం ప్ర‌క్రియ ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.