Begin typing your search above and press return to search.

స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేయడానికి వీల్లేదు : కేంద్రం !

By:  Tupaki Desk   |   27 May 2020 11:30 AM GMT
స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేయడానికి వీల్లేదు : కేంద్రం !
X
దేశ వ్యాప్తంగా ఈ మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో వైరస్ కేసులు లక్షన్నర దాటిపోయాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింలపులతో లాక్ ‌డౌన్ 4 కొనసాగిస్తోంది. అయితే మొన్నటి వరకు పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయనుకున్న క్రమంలో..ఈ సడలింపులు నేపథ్యంలో మళ్లీ కేసుల తీవ్రత పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం విద్యాసంస్థల పునఃప్రారంభంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇప్పటికే మే 31 వరకు దేశంలోని అన్ని విద్యా సంస్థలను మూసివేసి ఉంచాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేసుల తీవ్రత పెరుగుతున్న క్రమంలో.. విద్యాసంస్థల ఓపెనింగ్‌ పై కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రెస్ ఇన్‌ ఫర్‌ మేషన్ బ్యూరో ప్రకటించింది.

పలు రాష్ట్రాలు స్కూళ్లు , కాలేజీలను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలైతే అవి ప్రారంభమైయ్యే తేదీలను కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ..ఏ రాష్ట్రంలో కూడా స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేయడానికి వీలులేదు అని తెలిపింది. విద్యాసంస్థల పునః ప్రారంభంపై.. మే 31 తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.