Begin typing your search above and press return to search.

డైలాగులు చెప్పానంతే.. కేసు కొట్టేయండి ప్లీజ్ః న‌టుడు

By:  Tupaki Desk   |   16 Jun 2021 4:30 PM GMT
డైలాగులు చెప్పానంతే.. కేసు కొట్టేయండి ప్లీజ్ః న‌టుడు
X
బెంగాల్ ఎన్నిక‌ల వేళ రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేశాడ‌ని.. బీజేపీ నాయ‌కుడు, బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తిపై కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఈ కేసు విష‌య‌మై తాజాగా ఆయ‌న‌ను పోలీసులు ప్ర‌శ్నించిన‌ట్టు తెలుస్తోంది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా బెంగాల్లో ప‌లు ర్యాలీలు, బ‌హిరంగ స‌భ‌లో ఆవేశ‌పూరిత ప్ర‌సంగాలు చేశారు మిథున్.

‘‘ఎగిరి తంతే.. శ‌వం శ్మ‌శానంలో ప‌డుతుంది’’, ‘‘నేను మామూలు పామును కాదు.. నల్ల తాచుని. కాటేస్తే నీ ఫొటోకి దండ పడాల్సిందే’’ అనే అర్థం వ‌చ్చే వ్యాఖ్యలు చేశాడు. బెంగాల్ ఎన్నికల తర్వాత జరిగిన హింసలో 16 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ హింస‌పై మిథున్ చ‌క్ర‌వ‌ర్తి ప్ర‌సంగాల ప్ర‌భావం ఖ‌చ్చితంగా ఉంద‌ని పోలీసులు ఆరోపిస్తున్నారు.

ప‌రిస్థితి తీవ్ర‌త తెలిసిరావ‌డంతో మిథున్ న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. తాను ఆవేశంగా డైలుగులు మాత్ర‌మే చెప్పాన‌ని, ఉద్దేశ‌పూర్వ‌క ప్ర‌సంగాలు చేయ‌లేద‌ని ఈ మ‌ధ్య‌నే కోర్టుకు చెప్పాడు. త‌న‌పై దాఖ‌లైన ఎఫ్ఐఆర్ ను కూడా కొట్టేయాల‌ని అభ్య‌ర్థించాడు. కాగా.. అత‌న్ని వ‌ర్చువ‌ల్ గా విచారించాల‌ని న్యాయ‌స్థానం పోలీసుల‌ను ఆదేశించింది.