Begin typing your search above and press return to search.

మేనల్లుడిని కట్టేసి ఆంటీపై ఆరుగురి అత్యాచారం

By:  Tupaki Desk   |   20 Sep 2020 2:30 AM GMT
మేనల్లుడిని కట్టేసి ఆంటీపై ఆరుగురి అత్యాచారం
X
హర్యానాలో దారుణం జరిగింది. ఒక శుభకార్యానికి వచ్చి సొంతూరికి తన అల్లుడి బైక్ పై వెళుతున్న 45 ఏళ్ల మహిళను ఆరుగురు దుండగులు కత్తులు, వేటకొడవళ్లతో బెదిరించి అత్యాచారం చేశారు. మేనల్లుడిని చెట్టుకు కట్టేసి అతడి ముందే ఒకరి తర్వాత ఒకరు ఈ దారుణానికి పాల్పడ్డారు. దాన్ని వీడియో తీసి పోలీసులకు చెబితే సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించారు. అందులో ఒకడు ఆల్ రెడీ సోషల్ మీడియాలో వీడియోలు అమ్మకానికి పెట్టడంతో వీడియోలు వైరల్ అయ్యాయి.

రాజస్థాన్ కు చెందిన 45 ఏళ్ల మహిళ సెప్టెంబర్ 14న హర్యానాలోని ఓ గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరైంది. బంధువుల ఇంట్లో శుభకార్యం ముగిశాక తన మేనల్లుడితో కలిసి బైక్ లో సొంత ఊరికి బయలు దేరింది. కొన్ని కిలోమీటర్లు ప్రయాణించాక ఆరుగురు కామాంధులు వీరిని కత్తులు, వేటకోడవల్లు చేతబూని వెంటాడారు. నిర్జన ప్రదేశంలోకి వీరిని తీసుకెళ్లి ఆంటీపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. మేనల్లుడిని కట్టేసి ఈ దారుణానికి పాల్పడ్డారు.

ఆ సమయంలో కామాంధులు మొబైల్ లో రేప్ ను వీడియో తీసి పోలీసులకు చెబితే నీ పరువు తీస్తామని బెదిరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఒకడు ఆ వీడియోలను పోర్న్ సైట్ కు అమ్మి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.

దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ముగ్గురిని గుర్తించి అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.