Begin typing your search above and press return to search.

సుమేధ మృతిలో జీహెచ్ ​ఎంసీ తప్పే లేదట! మేయర్​ ప్రకటన

By:  Tupaki Desk   |   20 Sep 2020 1:30 PM GMT
సుమేధ మృతిలో జీహెచ్ ​ఎంసీ తప్పే లేదట! మేయర్​ ప్రకటన
X
గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోని నేరేడ్​మెట్​ ఓపెన్​ నాలాలో పడి సుమేధ(12) అనే బాలిక మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై నేరేడ్​ మెట్​ వాసులు తీవ్రంగా స్పందించారు. జీహెచ్​ ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయిందని ఆరోపించారు. తాజాగా ఈ ఘటనపై మేయర్​ బొంతు రామ్మోహన్​ స్పందించారు. జీహెచ్ ​ఎంసీ తప్పుఏమి లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు. దీంతో మేయర్​ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సుమేధ ఏలా చనిపోయింది?

నేరేడ్ ​మెట్​ కు చెందిన అభిజిత్‌ - సుకన్య దంపతుల కూతురు సుమేధ. తల్లిదండ్రుల ఇద్దరూ ఆఫీసుకు వెళ్లారు. ఇంట్లో నాన్నమ్మ సుమేధ మాత్రమే ఉన్నారు. అయితే ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నానంటూ నాన్నమ్మకు చెప్పిన సుమేధ సైకిల్​ మీద ఇంటి నుంచి బయలుదేరింది. చిన్నారి ఈస్ట్​ దీన్ ​దయాల్ ​నగర్​ చేరుకోగానే ఉధృతంగా నాలా ప్రవహిస్తుండటంతో అందులో సైకిల్​ తోపాటు కొట్టుకొని పోయింది. రాత్రైనా చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సీసీకెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జీహెచ్​ ఎంసీ సిబ్బంది తీవ్రంగా గాలించగా.. శనివారం బండచెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు - కాలనీవాసులు తీవ్రంగా స్పందించారు. జీహెచ్ ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తన కూతురు చనిపోయిందిని చిన్నారి తండ్రి ఆరోపించాడు. నాలా మీద జాలి ఏర్పాటు చేసి ఉంటే తన కూతురు బతికి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

రామ్మోహన్​ స్పందన..

ఈ ఘటనపై ఆలస్యంగా మేల్కొన్న మేయర్​ బొంతు రామ్మోహన్​ అసలు చిన్నారి తప్పిపోయిందని చెప్తున్న ప్రాంతంలో వర్షమే పడలేదు. చిన్నారి మృతిపై అనుమానాలు ఉన్నాయి. ఈ ఘటనలో జీహెచ్ ​ఎంసీ నిర్లక్ష్యమే లేదంటూ చెప్పకొచ్చారు. మేయర్​ ఏమన్నారంటే.. ‘సుమేధ మృతిపై నాకు అనుమానాలు ఉన్నాయి. చిన్నారి చనిపోయిన రోజు ఆ ప్రాంతంలో వర్షం పడలేడు. మోకాలి లోతు నీరు నిలిచే అవకాశం లేదు. నాలాలో పడి మృతదేహం రెండుమీటర్లు కొట్టుకొని వెళ్లే అవకాశం లేదు. పూర్తి వివరాలు వచ్చాక జీహెచ్ ​ఎంసీ తప్పు ఉంటే పరిహారం విషయం ఆలోచిస్తాం’ కాగా మేయర్​ సమాధానంతో కాలనీవాసులు మండిపడ్డారు. జీహెచ్​ ఎంసీ సిబ్బందిని రక్షించేందుకు మేయర్​ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.