Begin typing your search above and press return to search.

పాపం .. ఆ మహిళా ఐపీఎస్ ఇక జీవితంలో బిర్యానీ తినదేమో?

By:  Tupaki Desk   |   31 July 2021 5:28 AM GMT
పాపం .. ఆ మహిళా ఐపీఎస్ ఇక జీవితంలో బిర్యానీ తినదేమో?
X
బిర్యానీ .. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాన్ వేవ్ తినే ప్రతి ఒక్కరూ కూడా బిర్యానీ అంటే పడి చచ్చిపోతారు. బిర్యానీ కనిపిస్తే చాలు లొట్టలు వేసుకుంటూ లాగించేస్తారు. అయితే , అదే బిర్యానీ ఇప్పుడు ఓ మహిళా ఐపీఎస్ ను చిక్కుల్లో పడేసింది. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో ఈ విషయం ఆ రాష్ట్ర హోంమంత్రి వరకు వెళ్లింది. వెంటనే ఈ ఘటనపై విచారించాలని పోలీసులను ఆదేశించారు.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. మహారాష్ట్రలో డిప్యూటీ కమిషనర్‌ ర్యాంకులో మహిళా ఐపీఎస్‌ అధికారిణి తన సబార్డినేట్‌ తో విశ్రాంబాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏ రెస్టారెంట్‌ లో మంచి బిర్యానీ దొరుకుతుందని అడిగి తెలుసుకున్నారట. దీనికి అతను దేశీ ఘీ రెస్టారెంట్‌ అక్కడ ఫేమస్‌ అని చెప్పడంతో మటన్‌ బిర్యానీ తెప్పించాలని తెలిపింది. రెస్టారెంట్‌ వాళ్లు డబ్బులు అడిగితే స్థానిక పోలీస్‌ ఇన్‌ స్పెక్టర్‌ తో మాట్లాడించమని చెప్పింది. ఎందుకంటే తమ పరిధిలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందా అని మహిళా అధికారిణి అడిగింది. దీనికి సబార్డినేట్‌ మేము ఎప్పుడు బయట నుంచి ఆహారం ఆర్డర్‌ చేసినా డబ్బులు చెల్లించేవాళ్లం అని చెప్పాడు.

దీనిపై స్పందించిన మహిళా ఐపీఎస్‌ ఇప్పుడు సమస్య ఏంటి మా పరిధిలో ఉన్న రెస్టారెంట్‌ కు కూడా డబ్బులు చెల్లించాలా, అక్కడి ఇన్‌ స్పెక్టర్‌ చూసుకుంటాడని తెలిపింది. అయితే దీనికి సంబంధించిన ఈ ఆడియో క్లిప్‌ నెట్టింట వైరల్‌ గా మారడంతో ఈ విషయంపై ఐపీఎస్‌ అధికారిణి స్పందించింది. తన ఆడియో క్లిప్‌ ను మార్ఫింగ్‌ చేశారని ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారం మొత్తం సీనియర్ పోలీసు అధికారులను బదిలీ చేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడు బయటపడిందన్నారు.

ఇది నాపై వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర. నేను చేస్తున్న జోన్‌ లో కొన్నేళ్లుగా కొంతమంది ఇక్కడే పనిచేస్తున్నారు. వారి ఆర్థిక ప్రయోజనాలు ఇక్కడే ఉన్నాయి. ఈ కుట్రలో కొందరు సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. నేను ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన తరువాత వారి కార్యకలాపాలు ఆగిపోయాయి. అందుకే నన్ను తొలగించాలనే అక్కసుతో ఇదంతా చేశారు అని తెలిపారు. దీని పై సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించబోతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ తతాంగమంతా ఆ రాష్ట్ర హోం మంత్రికి చేరింది. ఈ విషయంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పూణే పోలీస్ కమిషనర్‌ కి ఆదేశాలు జారీ చేశారు.