Begin typing your search above and press return to search.

కేసీఆర్‌... పెట్రోల్‌పై 30 త‌గ్గించు.. బండి స‌వాల్‌!

By:  Tupaki Desk   |   22 May 2022 9:47 AM GMT
కేసీఆర్‌... పెట్రోల్‌పై 30 త‌గ్గించు.. బండి స‌వాల్‌!
X
కేంద్రంలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. తాజాగా మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ..లీటర్‌ పెట్రోల్‌పై తెలంగాణ ప్రభుత్వం రూ.30 పన్ను విధిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం వ్యాట్‌ తగ్గిస్తే లీటర్‌ పెట్రోల్‌ రూ.80కే ఇవ్వొచ్చన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో చేసిందేమీ లేదు కానీ దేశాన్ని ఉద్ధరిస్తారటని ఎద్దేవ చేశారు.

ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా పంజాబ్‌ రైతులకు ఎందుకు సాయం చేస్తున్నారని సంజయ్ ప్రశ్నించారు. గొప్పల కోసమే ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్‌ డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ఏం సంచలనం సృష్టిస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. ఇక తన అక్రమాస్తులు కాపాడుకోడానికే మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటన చేస్తున్నారని ఆరోపణలు చేశారు. పెట్రోల్, డీజిల్‎పై ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్‌ పర్యటనపై బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు.. సీఎం కేసీఆర్‌ 8 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమి లేదు కానీ... దేశాన్ని ఉద్దరిస్తాడటా.... అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ పెట్రోల్‌పై 30రూపాయల వ్యాట్‌ విధిస్తున్నారని.... దానిని తగ్గిస్తే రాష్ట్రంలో 80 రూపాయలకే పెట్రోల్‌ లభిస్తుందన్నా రు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావమున్నా కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను తగ్గించిందని సంజయ్‌ అన్నారు.

పెట్రో ధరలు తగ్గించినందుకు ఆయన మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేశారు. 'లీటర్‌ పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం రూ.30 పన్ను విధిస్తోంది. రాష్ట్రం వ్యాట్‌ తగ్గిస్తే లీటర్‌ పెట్రోల్‌ రూ.80కే ఇవ్వొచ్చు. దోచుకున్న సొమ్ము దాచుకునేందుకే కేటీఆర్‌ విదేశీ పర్యటనకు వెళ్లారు. సీఎం కేసీఆర్‌ ఇక్కడ చేసిందేమీ లేదు కానీ.. దేశాన్ని ఉద్ధరిస్తారట. ఇక్కడ జీతాలిచ్చే పరిస్థితి లేదు.. కానీ ఇతర రాష్ట్రాల వారికి సాయం చేస్తారట. రాష్ట్రంలో పింఛన్లు సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. కొండగట్టులో ప్రజలు చనిపోతే సీఎం పరామర్శించారా? సమ్మెలో ఆర్టీసీ కార్మికులు చనిపోతే వారినైనా పరామర్శించారా?'' అని నిప్పులు చెరిగారు.