Begin typing your search above and press return to search.

ప్రముఖ చానెల్ చర్చలో బీజేపీ నేత విష్ణుపై చెప్పుతో దాడి

By:  Tupaki Desk   |   24 Feb 2021 3:51 AM GMT
ప్రముఖ చానెల్ చర్చలో బీజేపీ నేత విష్ణుపై చెప్పుతో దాడి
X
ప్రముఖ న్యూస్ చానెల్ లో అమరావతి గురించి నిర్వహించిన చర్చా కార్యక్రమం రసాభాసకు దారితీసింది. ఏకంగా బీజేపీ అధికార ప్రతినిధి, ప్రముఖ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై లైవ్ లోనే చెప్పుతో కొట్టిన ఘటన సంచలనమైంది. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ కేబినెట్ తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాల్లో రాజధాని నిర్మాణాలను కొనసాగిస్తామని.. ఈ మేరకు రూ.3వేల కోట్లతో సగం పూర్తయిన అమరావతి భవనాలను పూర్తి చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.

ఈ క్రమంలోనే ప్రముఖ న్యూస్ చానెల్ మంగళవారం రాత్రి చర్చను దీనిపైనే పెట్టింది. ఈ డిబేట్ కు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తోపాటు ఏపీ అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొటికలపూడి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

ఈ క్రమంలోనే బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందని ఏపీ అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ విమర్శించాడు. దీనికి విష్ణు వర్ధన్ రెడ్డి ధీటుగా కౌంటర్ ఇచ్చాడు. నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ అని.. టీడీపీకి కొమ్ము కాస్తున్నావని విమర్శించారు. మాట మాట పెరిగింది. సీరియస్ అయిన శ్రీనివాస్ ఏకంగా చెప్పు తీసుకొని లైవ్ లోనే అందరూ చూస్తుండగానే బీజేపీ నేత విష్ణుపై దాడికి దిగాడు. విష్ణు కుడిభుజానికి ఈ చెప్పు బలంగా తాకింది. దీంతో వెంటనే లైవ్ ను కట్ చేశారు.

దీనిపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ఈ వీడియో వైరల్ కావడం.. రాజకీయ దుమారం రేపుతోంది.బీజేపీ నేత విష్ణుకు సదురు చానెల్ జర్నలిస్టు క్షమాపణలు చెప్పారు. శ్రీనివాస్ ను బయటకు పంపించారు.