Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యేల ఆయువు పట్టుపై కొట్టిన వైసీపీ?

By:  Tupaki Desk   |   1 Jun 2020 10:31 AM GMT
టీడీపీ ఎమ్మెల్యేల ఆయువు పట్టుపై కొట్టిన వైసీపీ?
X
ప్రకాశం జిల్లాకు చెందిన ఆ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల ఆయువుపట్టుపై వైసీపీ ప్రభుత్వం కొట్టబోతోందా? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. వారి వ్యాపారాలపై అదును చూసి దెబ్బకొట్టడానికి ప్రభుత్వం రెడీ అయినట్లు తెలిసింది. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వ్యాపార రంగంలో ఉన్న ఆ ముగ్గురి క్వారీల నుంచి ఎగుమతులు నిలిపివేసినట్లు తెలిసింది.

మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు క్వారీలో గ్రానైట్ విక్రయాలకు సంబంధించిన పర్మిట్లు నిలిపివేయనున్నట్టు సమాచారం.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడానికి సమాయత్తమైనట్టు తెలిసింది.

ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల క్వారీల్లో ఉత్పత్తి అయిన గ్రానైట్ ఎగుమతికి సంబంధించి ఇచ్చే పర్మిట్లను, గనులశాఖ నిలిపివేయనుంది. ఈ మేరకు నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే టీడీపీ ఎమ్మెల్యేలకు పెద్ద షాక్ ను వైసీపీ ప్రభుత్వం ఇచ్చినట్టు అవుతుంది.