Begin typing your search above and press return to search.

కాళ్లు పట్టి అచ్చెన్నా.. ‘కుర్చీ’ లాగేశాడా?

By:  Tupaki Desk   |   28 Sep 2020 1:30 PM GMT
కాళ్లు పట్టి అచ్చెన్నా.. ‘కుర్చీ’ లాగేశాడా?
X

తెలుగుదేశం పార్టీలో కొత్త పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జులు - కో ఆర్డినేటర్ల నియామకాలు చిచ్చుపెట్టాయన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కూన రవికుమార్ ను చంద్రబాబు ఎంపిక చేయడంపై అసంతృప్తి చెలరేగింది. ఆ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న గౌతు శిరీష పక్కనపెట్టడం దుమారం రేపిందట..

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని రాష్ట్ర అధ్యక్షుడిని చంద్రబాబు చేయబోతున్నారన్న టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత - మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ పాదాలకు మొక్కి ఆశ్వీరాదం తీసుకున్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అయితే అశీర్వచనాలు తీసుకున్న వారం రోజులకే గౌతు శివాజీ కూతురు .. శ్రీకాకుళం టీడీపీ జిల్లా అధ్యక్షురాలును జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఆ ప్లేసులో పార్లమెంట్ ఇన్ చార్జిగా రవికుమార్ ను నియమించారు.

దీంతో టీడీపీలో కీలక నేతగా ఉన్న అచ్చెన్నకు తెలియకుండా ఈ నియామకం జరిగి ఉండదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఓ వైపు కాళ్లు మొక్కుతూనే మరోవైపు గౌతు శివాజీకి అచ్చెన్న ఎసరు పెట్టాడని శ్రీకాకుళంలో కొందరు టీడీపీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.

ఇక సీనియర్ నేత గౌతు శివాజీకి కనీసం మాట మాత్రం అయిన చెప్పకుండా ఆయన కూతురును జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించడం ఆ పార్టీలో చిచ్చురేపుతోందని అంటున్నారు. గౌతు కుటుంబంపై చంద్రబాబు ఏమాత్రం అభిమానం చూపడం లేదని.. వారంతా అసంతృప్తితో ఉన్నట్టు ఆ జిల్లాలో ప్రచారం సాగుతోంది.

మొత్తానికి కాళ్లకు మొక్కిన అచ్చెన్న.. గౌతు శివాజీ కుటుంబానికి అన్యాయం చేశాడా? ఆయనకు తెలియకుండా ఇది జరిగిందా? లేక బాబు-అచ్చెన్న కలిసే ఇలా చేశారా అన్నది ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఇదే ఇఫ్పుడు ఆ జిల్లాలో జోరుగా చర్చకు దారితీసింది.