Begin typing your search above and press return to search.

అభిజ్ఞా ఆనంద్ చెప్పిన మరో కఠోర నిజం ... ఏప్రిల్ లో జరిగేది ఇదే

By:  Tupaki Desk   |   4 April 2020 5:30 PM GMT
అభిజ్ఞా ఆనంద్ చెప్పిన మరో కఠోర నిజం ... ఏప్రిల్ లో జరిగేది ఇదే
X
ప్రస్తుతం కరోనా అనే పేరు వింటేనే ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ఈ మహమ్మారి ప్రపంచంలోని ప్రతి ఒక్కరి వెన్నులో వణుకుపుట్టిస్తుంది. ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు అంతం అవుతుందో ఎవరికీ తెలియదు కానీ , దీనిపై రకరకాలైన కథలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ కరోనా అనే మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది అని ..అప్పట్లోనే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అంటూ పెద్ద ఎత్తున ఎప్పుడు ప్రచారం అవుతుంది. అలాగే మైసూర్ కి చెందిన బాల మేధావి పేరు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలలో మారుమోగి పోతుంది. ఇలా ప్రపంచం మొత్తం ఒక వైరస్ వల్ల వణికిపోతోంది అని గత కొన్ని నెలల ముందే గ్రహాల లెక్కల బట్టి ..చెప్పాడు. ఆ బాల మేధావి ఎప్పుడో చెప్పిన విషయాలు ..ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. ఆ బాల మేధావి కరోనా వైరస్ అనే పేరు చెప్పకపోయినప్పటికీ కూడా మిగిలిన అన్ని విషయాలు అయన చెప్పినట్టే జరుగుతుండటంతో జనాలలో ఆ బాల మేధావి పై ఒక నమ్మకం అయితే ఏర్పడింది.

ఆ బాల మేధావి పేరు అభిజ్ఞా ఆనంద్ .. ఈ పేరు ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ 14 ఏళ్ల బాల మేధావికి అన్ని విషయాలపై సమగ్రమైన పట్టు ఉంది. అసలు ఇప్పుడు ఈ బాల మేధావి గురించి చర్చ ఎందుకు నడుస్తుంది అంటే ..ఏప్రిల్ నెలలో దేశంలో ఒక వైరస్ విజృంభిస్తుంది అని చెప్పాడు. అతడు చెప్పినట్టుగానే కంట్రోల్ కి వచ్చింది అనుకున్న కరోనా గత రెండు రోజులుగా దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. అభిజ్ఞా లెక్కలు వేరు ..ఇతర సిద్దాంతులు చెప్పే లెక్కలు వేరు. అసలు ఏడు నెలల క్రితమే ఓ యూట్యూబ్ వీడియోలో ఏం చెప్పాడంటే? 2020 లో ప్రపంచంలో ఓ బయలాజికల్ వార్ జరుగుతుందని అప్పుడు చైనా దేశమే బాగా ఇబ్బందిపడిపోతుందని మొత్తం రవాణా అంతా ఎక్కడికక్కడ స్థంబించిపోతుందని చెప్పాడు. అప్పుడు ఆ అభిజ్ఞా చెప్పినట్టే .ఇప్పుడు జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ వైరస్ నుండి ప్రపంచానికి ఎప్పుడు విముక్తి అంటే ..ప్రస్తుతం ఈ వైరస్ కు బలం చేకూర్చే గ్రహాలు చాలా ఉన్నాయి అని, దీని వల్ల ఏప్రిల్ నెల చివరి వరకు ఈ వైరస్ ప్రభావం ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి బుధుడు ..ఏప్రిల్ 8 న మినా రాశిలోకి అడుగు పెట్టబోతున్నాడు. అదే సమయానికి గురు గ్రాహం కూడా మకరరాశిలోకి ప్రవేశిస్తుంది. రాజు అయినటువంటి బుధ గ్రాహం నీచ స్థానములోకి వెళ్లడం ..మీన రాశి బుధ గ్రహానికి నీచ స్థానము. అక్కడ రవి గ్రహంతో కలిసి ఉండటం , శని , కుజులు కలిసి ఉండటం, ఇంకా కొన్ని కారణాల వల్ల ..మొత్తం మీద ఏప్రిల్ 4 నుండి ఏప్రిల్ 29 వరకు గడ్డు కాలం అని చెప్పవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.