Begin typing your search above and press return to search.

ముంబై x ఢిల్లీ ఐపీఎల్​ ఫైనల్​ మ్యాచ్​ ఇదే.. ఆకాశ్​ చోప్రా ట్వీట్​!

By:  Tupaki Desk   |   17 Oct 2020 3:10 PM GMT
ముంబై x ఢిల్లీ ఐపీఎల్​ ఫైనల్​ మ్యాచ్​ ఇదే..  ఆకాశ్​ చోప్రా ట్వీట్​!
X
యూఏఈ వేదికగా ఐపీఎల్​ 2020 మాంచి రసవత్తరంగా సాగుతుంది. ఐపీఎల్​ స్టార్ట్​ కావడంతో సోషల్​మీడియాలోనూ ట్రోల్స్​, మీమ్స్​ మొదలయ్యాయి. ఇటీవల మరీ క్రికెటర్ల భార్యలను, ప్రియురాళ్లను కూడా ఐపీఎల్​ వివాదంలోకి లాగుతున్నారు. దీంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ నీ కూతురుపై ఓ యువకుడు అసభ్యకరంగా కామెంట్​ చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజగా మాజీ క్రికెటర్​ , ప్రముఖ కామెంటర్​ ఆకాశ్​ చోప్రా మాత్రం ఓ ఆసక్తికర ట్వీట్​ చేశారు. అతడి ట్వీట్​కు సోషల్​ మీడియా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.. ఆకాశ్​ చోప్రా ఏమన్నారంటే.. 'ఐపీఎల్​ ఫైనల్​లో ముంబై, ఢిల్లీ తలపడవచ్చని నా అంచనా' అంటూ ట్వీట్​ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్​ వైరల్​గా మారింది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై, ఢిల్లీ దూసుకుపోతున్నాయి. చెరో 12 పాయింట్లతో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. 10 పాయింట్లతో ఆర్​సీబీ మూడో స్థానంలో, 8 పాయింట్లతో కేకేఆర్​ నాలుగు స్థానంలో ఉండగా.. సన్​రైజర్స్​, చైన్నై సూపర్​కింగ్స్​, రాజస్థాన్​ రాయల్స్​ ఆరు పాయింట్ల చొప్పున తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ జట్లు లీగ్​ దశలో మరో ఆరు మ్యాచ్​లు ఆడాల్సి ఉన్నది. ఇంకో 4 పాయింట్లు దక్కించుకొనే జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తాయి.

అయితే ప్రస్తుతం పది పాయింట్లలో 10 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్న ఆర్​సీబీ, ఐదు మ్యాచ్​ల్లో మూడు విజయాలు సాధిస్తే నెట్​ రన్​రేట్​ లాంటి సమీకరణలు అవసరం లేకుండా ప్లే ఆప్స్​కు చేరుకుంటుంది. మరోవైపు ఈ సీజన్​లో ఢిల్లీ, ముంబై జట్లు ఆద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాయి.

ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. దీంతో ఆకాశ్​ చోప్రా ట్వీట్​ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆకాశ్​ చోప్రా ట్వీట్​కు సన్​రైజర్స్​ మాజీ కోచ్​ టామ్​ కౌంటర్​ ఇచ్చారు. మీకు అసలైన జట్టు (చైన్నై సూపర్​కింగ్స్​) కనిపించడం లేదా అంటూ రిప్లై ఇచ్చాడు. ఆకాశ్​ చోప్రా ట్వీట్​ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.