Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రి సుచరిత అడిగిన.. పత్రాల్ని బాబు చూపిస్తారా?

By:  Tupaki Desk   |   25 May 2020 6:15 AM GMT
ఏపీ మంత్రి సుచరిత అడిగిన.. పత్రాల్ని బాబు చూపిస్తారా?
X
ప్రచార హడావుడి.. ఏదో ఒక వివాదాన్ని నెత్తి మీద వేసుకోకుండా బాబుకు పొద్దుపొడవదా? అన్న సందేహం వచ్చేలా ఆయన తీరు ఉంటుందని చెప్పాలి. గడిచిన కొన్ని వారాలుగా హైదరాబాద్ లోనే ఉండిపోయిన ఆయన.. తాజాగా ఏపీకి వచ్చేందుకు తహతహలాడుతున్నారు. ఏపీలో ఇటీవల జరిగిన ఎల్ టీ పాలిమర్స్ బాధితుల్ని పరామర్శించాలన్న పేరుతో ఏపీకి రావాలని భావిస్తున్న బాబు తీరును ఏపీ మంత్రి మేకపాటి సుచరిత ప్రశ్నించారు.

విశాఖలో బాధితుల్ని పరామర్శించేందుకు ఏపీ డీజీపీకి లేఖ రాసినట్లుగా బాబు చెబుతున్నారని.. అసలు ఎప్పుడు లేఖ రాశారు? అన్న సూటిప్రశ్నను సంధించారు. ఏపీలో దరఖాస్తు చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన వైనాన్ని గుర్తు చేశారు. ఏపీలో ఎలాంటి దరఖాస్తుచేయలేదన్న ఆమె.. అందుకు ఆధారాలుచూపిస్తారా? అని ప్రశ్నించారు.

ఇప్పటికే ఎల్ జీ పాలిమర్స్ బాధితుల్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ లు కూడా పరామర్శించారన్నారు. వారి పర్యటనకు ఎలాంటి వివాదం లేనప్పుడు.. బాబు ప్రయాణానికి ఎందుకు ఇబ్బందులు ఉంటాయని సూటిగా ప్రశ్నిస్తున్నారు. నిజమే.. ఏదో జరిగిపోతున్నట్లుగా సీన్ మొత్తం ఎవరిది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మేకపాటి సుచరిత చెప్పినట్లు.. ఏపీ డీజీపీకి బాబు రాసినట్లుగా చెబుతున్న లేఖ కాపీని విడుదల చేయొచ్చు కదా? అన్న క్వశ్చన్ రాక మానదు.