Begin typing your search above and press return to search.

ఇళ్లస్థలాల కేటాయింపుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   16 July 2020 4:15 AM GMT
ఇళ్లస్థలాల కేటాయింపుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X
ఏపీలో పేదలకు ఇళ్లస్థలాల కేటాయింపుకు ఏదో ఒక అవరోధం వచ్చిపడుతోంది. మొన్నటికి మొన్న వైఎస్ఆర్ జయంతి రోజు రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఉచితంగా పంపిణీ చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.. రాష్ట్రవ్యాప్తంగా 30లక్షల మహిళలకు పెద్దఎత్తున ఇళ్ల పట్టాలు ఈనెల 8న వైఎస్ఆర్ జయంతి నాడు ఇవ్వాలి అని ఎప్పుడో నిర్ణయించారు. కానీ ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఎందుకంటే అర్హులకు కాకుండా అనర్హులకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు కేటాయించినట్టు కంప్యూటర్ లో చూపిస్తోందట.. అర్హులకు దాదాపు 90శాతం రాలేదు అని ఏదో గోల్ మాల్ జరిగిందని భావించి వాయిదావేశారని సమాచారం.

2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఇబ్బడిముబ్బడిగా అనర్హులకు పోతున్నాయని సంక్షేమ పథకాలు కట్ చేయాలని ఒక సాధికార సర్వే చేశారు. ఆ సర్వేలో అప్పటి టీడీపీ జన్మభూమి కమిటీ వాళ్లు మేనేజ్ చేసుకొని వాళ్లకు అనుకూలంగా మార్చేసుకున్నారట.. టీడీపీ నాయకులకి అన్ని ఉన్నా రేషన్ కార్డ్, ఆరోగ్యశ్రీ, సంక్షేమ పథకాలు వచ్చేటట్టు సర్వేలో చేసుకున్నారని టాక్. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు ఇదే సాధికారిక సర్వే వాడుతున్నారంట.. పేద ప్రజలకు కాకుండా టీడీపీ నాయకులకి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు మంజూరయ్యాయని వైసీపీ నాయకులు ఫిర్యాదులు చేశారట.. దీని మీద సమగ్ర సర్వే జరగాలి అని ప్రజలు కూడా కోరుకుంటున్నారు అని ప్రభుత్వంకు ఒక రిపోర్ట్ వచ్చింది. అందుకే ఇళ్లస్థలాల పంపిణీని జగన్ అర్జంటుగా వాయిదా వేశారు.

తాజాగా మళ్లీ అర్హులకు సర్వే చేసి ఇద్దామనుకునే లోపు హైకోర్టు బ్రేక్ వేసేలా ఉంది. ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రెవెన్యూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం పశువుల మేత కోసం కేటాయించిన భూములు, నదులు, చెరువులు, కుంటల తీర ప్రాంతాల్ని ఇతర అవసరాలకు మార్చడం నిషేధమని స్పష్టం చేసింది. ఆ భూములను ఇళ్ల స్థలాలుగా మార్చే అధికారం ఎక్కడుందని.. బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ కు విరుద్ధంగా జీవో ఎలా జారీ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో మరోసారి ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యం అనివార్యం కానుంది.