Begin typing your search above and press return to search.

కసాయి తల్లి ఎఫైర్.. మొన్న కూతురు.. నేడు భర్త ఆత్మహత్య!

By:  Tupaki Desk   |   11 July 2020 5:33 PM GMT
కసాయి తల్లి ఎఫైర్.. మొన్న కూతురు.. నేడు భర్త ఆత్మహత్య!
X
పెళ్లి అయ్యి ఓ కూతురు ఉన్నా కూడా ఆ వివాహిత పక్కదారి పట్టింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను దూరం పెట్టింది. ఒకరితో ఎఫైర్ పెట్టుకుంది. వాడిని వదిలి మరొకరితో సంబంధం పెట్టుకుంది. ఆ కోపంతో మొదటి వాడు ఈమె కన్న కూతురును చంపేశాడు. భార్య ఇలా ఇద్దరితో ఎఫైర్ పెట్టుకోవడం.. కూతురు హత్యను తట్టుకోలేక ఆ భార్త తాజాగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం ఘట్ కేసర్ పరిధిలో అందరినీ కంటతడిపెట్టించింది. ఓ కసాయి తల్లి తన సుఖం కోసం కన్నబిడ్డను, కట్టుకున్న భర్తను బలి చేసిన దారుణం వెలుగుచూసింది.

భువనగిరి ప్రాంతానికి చెందిన కళ్యాణ్ 2011లో అనూష అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 2015లో ఆద్య అనే చిన్నారి జన్మించింది. రెండేళ్లుగా వీరు ఇస్మాయిల్ ఖాన్ గూడలో ఉంటున్నారు. కళ్యాణ్ ప్రభుత్వ ఉద్యోగమైన గ్రామ కార్యదర్శి కావడంతో రోజూ యాదాద్రి జిల్లా ఆత్మకూరుకు వెళ్లేవాడు.

ఇదే అదునుగా భార్య అనూష ఆ ప్రాంతంలో ఉండే కరుణాకర్ అనే అబ్బాయితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇక అతడిపై మోజు తీరిపోవడంతో వదిలేసి మరో స్నేహితుడైన రాజశేఖర్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ఈ క్రమంలోనే మొదటి ప్రియుడు కరుణాకర్ వారం కిందట అనూషను నిలదీయడానికి వచ్చాడు. అక్కడే రాజశేఖర్ తో అనూష చనువుగా ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. అనూషను తనతో రావాలని హెచ్చరించాడు. ఆమె బయటకు రాకపోవడంతో బయట ఉన్న అనూష కూతురును చంపేస్తానంటూ బెదిరించాడు. కరుణాకర్ మాటలను అనూష పట్టించుకోకపోవడంతో అతడు కోపంతో బయట ఆడుకుంటున్న చిన్నారి ఆద్య గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు.

ఇది జరిగి వారం రోజులు అవుతోంది. కూతురు హత్య.. భార్య వివాహేతర సంబంధాలతో నలిగిపోయిన భర్త కళ్యాణ్ మానసికంగా కృంగిపోయి భవనగిరి రైల్వే ట్రాక్ పై పడి తాజాగా ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఒక మహిళ చేసిన పాడు పనికి పాపం ఆమె బిడ్డ భర్త దూరమైన ఘోరం ఘట్ కేసర్ లో విషాదం నింపింది.