Begin typing your search above and press return to search.

వామన్​ రావు నా భర్తను చంపాడు’ మీడియా ముందుకొచ్చిన బాధితురాలు..!

By:  Tupaki Desk   |   22 Feb 2021 5:52 AM GMT
వామన్​ రావు నా భర్తను చంపాడు’ మీడియా ముందుకొచ్చిన బాధితురాలు..!
X
న్యాయవాద దంపతులు వామన్​రావు, ఆయన భార్య ఇటీవల నడిరోడ్డు మీద హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుంట శ్రీను, బిట్టు శ్రీను మరికొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హత్యలో అధికార పార్టీకి చెందిన ఓ నేత హస్తం కూడా ఉన్నట్టు ఆరోపణలు వినిపించాయి. ఇదిలా ఉంటే వామన్​రావు తన భర్తను హత్య చేశాడంటూ ఓ మహిళ మీడియా ముందుకు వచ్చింది. నల్లవెల్లి అరుణజ్యోతి అనే ఓ మహిళ సంచలన విషయాలను బయటపెట్టారు.

కరీంనగర్ లో ఆమె మీడియా సమావేశంలో ఏం చెప్పిందటే.. ‘నా భర్త వెంకటేశ్వర్లు ఇరిగేషన్​శాఖలో పనిచేసేవారు. ఆయనను ఇటీవల హత్యకు గురైన వామన్​రావు హత్య చేశాడు. 2008లో నా కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 1.50 లక్షలు తీసుకొని వామన్​రావు మోసం చేశాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని అడగడంతో కరీంనగర్​ అల్గునూర్​ వద్ద నా భర్తను కిడ్నాప్​ చేసి నల్లగొండ జిల్లా వెలిగొండ గ్రామంలో హత్య చేశాడు.

ఆ హత్యపై అప్పుడు నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. హోంమంత్రిని, స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి విషయం చెప్పాను అయినా న్యాయం జరగలేదు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో వామన్​రావు బాధితులు చాలా మంది ఉన్నారు. ఇప్పడిప్పుడే వాళ్లంతా బయటకు వస్తున్నారు.’ అంటూ ఆమె చెప్పారు. అయితే ఓ వైపు పోలీసులు ఈ జంట హత్యల కేసులను విచారిస్తున్న సందర్భంలో ఓ మహిళ మీడియా ముందుకు రావడం సంచలనంగా మారింది.