Begin typing your search above and press return to search.

స్లీపర్ బస్సులో.. గుడికి వెళుతుంటే.. కిడ్నాప్ చేసి.. ఇదేం పోయే కాలం?

By:  Tupaki Desk   |   22 Sep 2021 5:18 AM GMT
స్లీపర్ బస్సులో.. గుడికి వెళుతుంటే.. కిడ్నాప్ చేసి.. ఇదేం పోయే కాలం?
X
ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? కామంతో కళ్లు మూసుకుపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మగాళ్లు జంతువుల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మూడు దారుణ అత్యాచారాలు వెలుగు చూశాయి. ఈ మూడు ఉదంతాల్ని చూసిన తర్వాత.. ఎక్కడా ఆడాళ్లకు రక్షణ లేదా? అన్న సందేహం కలుగక మానదు. తాజాగా వెలుగు చూసిన మూడు ఉదంతాలు.. భిన్నంగా ఉండటం.. నేరం మాత్రం ఒకటే కావటం గమనార్హం.

స్లీపర్ బస్సులో..

ఉత్తరప్రదేశ్ లో కదులుతున్న ఒక బస్సులో పదిహేనేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు బస్సు సిబ్బంది. బదర్ పుర్ నుంచి ఆరియాకు వెళుతున్న స్లీపర్ బస్సులో తల్లి కుమార్తెలు ప్రయాణిస్తున్నారు. రాత్రి పదకొండు గంటల వేళలో.. బస్సు సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. దీంతో..ప్రయాణికులతో పాటు బాలిక కుటుంబం బస్సులో నుంచి కిందకు దిగింది. ఆ సమయంలో బాలిక బస్సులోనే నిద్ర పోవటంతో ఆమెను బస్సులో ఉంచి మిగిలిన వారు కిందకు దిగారు.

ఆ సమయంలో బాలిక మీద కన్నేసిన కండెక్టర్ బబ్లూ.. సహాయకుడు ఆషూలు ఆ బాలికను రేప్ చేశారు. జరిగిన దారుణం గురించి బాధితురాలి తన తల్లికి చెప్పింది. దీంతో.. వారిద్దరిని ఆమెను ప్రశ్నిస్తుంటే.. ఆమెను నెట్టేశారు. అనంతరం బస్సు దిగి పారిపోయారు. శికోహాబాద్ కు బస్సు చేరుకున్నంతనే బాధిత బాలిక.. ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆషూను అదుపులోకి తీసుకున్నారు. బబ్లూను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.

కిడ్నాప్ చేసి హత్యాచారం

ఈ ఉదంతాన్ని చూసినప్పుడు హైదరాబాద్ లోని సైదాపేటలో చోటు చేసుకున్న హత్యాచార ఉదంతం గుర్తుకు రాక మానదు. రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో పొరుగింటి వ్యక్తే అత్యాచార దారుణానికి పాల్పడ్డాడు. ‘పాడు కలాన్’ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే దినేశ్ బాలికను కిడ్నాప్ చేసి.. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను చంపేశాడు. బాలిక కనిపించకపోవటంతో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు రంగంలోకి దిగి దినేశ్ ను అరెస్టు చేశారు. విచారణలో అతడు వెల్లడించిన సమాచారం ఆధారంగా బాలిక డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

గుడికి వెళుతుంటే గ్యాంగ్ రేప్

బంధువుతో కలిసి పందొమ్మిదేళ్ల యువతి గుడికి వెళుతుంటే.. అడ్డుకొని సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఫూణె జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు అక్కడ పెను సంచలనంగా మారింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల్లో భర్తకు బంధువే కావటం గమనార్హం. గ్రామానికి చెందిన యువతి తన భర్తకు చెందిన బంధువులతో కలిసి గుడికి వెళ్లింది.

గుడికి వెళ్లే దారిలో అటవీ ప్రాంతం ఉంది. భర్త బంధువు.. అతని స్నేహితుడు ఆమెను గొంతు నొక్కేసి.. సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశారు. ఆమె అందుకు తీవ్రంగా ప్రతిఘటించటంతో ఆమె గొంతును కండువాతో చుట్టేసి చంపేశారు. అనంతరం ఆమె ముఖాన్ని గుర్తించకుండా ఉండేందుకు రాయితో ఛిద్రం చేశారు. ఈ దారుణంపై నమోదైన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలి భర్త బంధువును అరెస్టు చేశారు. మిగిలిన వారిని సైతం అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు. వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.