Begin typing your search above and press return to search.
కోవిడ్ ఆసుపత్రిలో 40 నిమిషాలు నరకం చూసి..
By: Tupaki Desk | 4 Aug 2020 11:30 PM GMTఈ మధ్యే నల్గొండ జిల్లాలో కరోనా బారిన పడ్డ ఓ యువకుడు ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేక.. ఆక్సిజన్ అందక తల్లి చేతుల్లో ప్రాణాలు కోల్నోయిన వైనం అందరూ చూశారు. పట్టించుకునేవాళ్లు లేక ఆ తల్లే వెంటిలేటర్ ను కొడుక్కి పెట్టి ప్రాణం నిలబెట్టేందుకు ప్రయత్నిస్తూ తల్లడిల్లిన వైనం కన్నీళ్లు పెట్టించింది. ఇలాంటి ఉదంతాలు చాలాచోట్ల జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దారుణమైన పరిస్థితుల్ని కళ్లకు కట్టే మరో దారుణం విజయవాడలో చోటు చేసుకుంది. అక్కడి ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రి లో ప్రాణాలు పోతున్నాయి.. కాపాడండి.. అంటూ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు 40 నిమిషాల పాటు కేకలు పెట్టినా పట్టించుకోని దయనీయ పరిస్థితి నెలకొంది. చివరికి ఆ వృద్ధుడు అందరూ చూస్తుండగానే ప్రాణాలు వదిలాడు. ఈ ఉదంతం మొత్తం వీడియో తీసిన పక్క పేషెంట్ మీడియాకు అందజేశాడు.
రెండు రోజుల కిందట ఈ దారుణం చోటు చేసుకుంది. తన పక్క బెడ్డుపై ఉన్న ఓ కరోనా బాధితుడు దాదాపు 40 నిమిషాల పాటు పెద్దగా కేకలు పెట్టి అరిచినా వైద్యులు, నర్సులు ఎవరూ రాలేదని... అతని బాధను చూడలేక నీరసంగా ఉన్నప్పటికీ తనే వార్డు బయట ఉన్న స్టాఫ్నర్సులకు చెప్పానని.. రాత్రి 2.30 గంటలకు చెబితే అరగంట తర్వాత అతని వద్దకు వచ్చారని.. అప్పటికే అతను చనిపోయాడని సదరు పేషెంట్ వెల్లడించాడు.
మృతదేహాన్ని ఉదయం వరకు మార్చురీకి తరలించలేదని.. అలాగే మరో వ్యక్తి ఇదే ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయాడని.. రాత్రిపూట ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న అతనికి తనే మూడుసార్లు ఆక్సిజన్ మాస్క్ తగిలించానని.. అయినా అతను బతకలేదని.. మరొక వ్యక్తి కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడుతూనే చనిపోయాడని.. అక్కడ డ్యూటీ డాక్టర్ ఉన్నా కూడా పట్టించుకోలేదని.. విజయవాడ కోవిడ్ ఆసుపత్రిలో దారుణమైన పరిస్థితులకు ఇది నిదర్శనమని ఆ పేషెంట్ వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోెషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రెండు రోజుల కిందట ఈ దారుణం చోటు చేసుకుంది. తన పక్క బెడ్డుపై ఉన్న ఓ కరోనా బాధితుడు దాదాపు 40 నిమిషాల పాటు పెద్దగా కేకలు పెట్టి అరిచినా వైద్యులు, నర్సులు ఎవరూ రాలేదని... అతని బాధను చూడలేక నీరసంగా ఉన్నప్పటికీ తనే వార్డు బయట ఉన్న స్టాఫ్నర్సులకు చెప్పానని.. రాత్రి 2.30 గంటలకు చెబితే అరగంట తర్వాత అతని వద్దకు వచ్చారని.. అప్పటికే అతను చనిపోయాడని సదరు పేషెంట్ వెల్లడించాడు.
మృతదేహాన్ని ఉదయం వరకు మార్చురీకి తరలించలేదని.. అలాగే మరో వ్యక్తి ఇదే ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయాడని.. రాత్రిపూట ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న అతనికి తనే మూడుసార్లు ఆక్సిజన్ మాస్క్ తగిలించానని.. అయినా అతను బతకలేదని.. మరొక వ్యక్తి కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడుతూనే చనిపోయాడని.. అక్కడ డ్యూటీ డాక్టర్ ఉన్నా కూడా పట్టించుకోలేదని.. విజయవాడ కోవిడ్ ఆసుపత్రిలో దారుణమైన పరిస్థితులకు ఇది నిదర్శనమని ఆ పేషెంట్ వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోెషల్ మీడియాలో వైరల్ అవుతోంది.