Begin typing your search above and press return to search.
నయన తార చిరును వెయిట్ చేయిస్తోందా?
By: Tupaki Desk | 22 Jan 2021 5:30 PM GMTమెగాస్టార్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. ఈ చిత్రం షూట్ చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరిలోపు చిత్రీకరణ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది. మే నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో.. చిరు నెక్స్ట్ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఆచార్య తర్వాత చిరంజీవి చేయబోతున్న లూసీఫర్, వేదాళం రీమేక్ లలో లూసీఫర్ ముందుగా మొదలవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.
లూసీఫర్ చిత్రానికి రీమేక్ స్పెషలిస్ట్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. సినిమా సెట్స్ మీదకు వెళ్లే టైం దగ్గరపడుతున్నప్పటికీ.. హీరోయిన్ ఎవరనేది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతారను అనుకుంటున్న విషయం తెలిసిందే. కానీ.. అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.
లూసీఫర్ ఒరిజినల్లో మంజు వారియర్ పోషించిన పాత్రను నయనతార టేకేవర్ చేస్తుందనే ప్రచారం జరిగింది. దాదాపు కన్ఫామ్ అయ్యిందని కూడా వార్తలు వచ్చాయి. కానీ.. మేకర్స్ ఇంకా నయనతార పేరును ప్రకటించలేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. మేకర్స్ నయన్ ను సంప్రదించారట. కానీ.. ఏ విషయమైందీ ఆమె చెప్పలేదట.
లూసీఫర్ విషయంలో నయనతార 'నో' చెప్పలేదట. అలాగని 'ఎస్' అని కన్ఫామ్ కూడా చేయలేదట. దీనికి.. కారణం ఏమై ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది. అయితే.. ప్రియుడు విఘ్నేష్ శివన్తో నయనతార వివాహం జరగబోతోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నయనతార లూసీఫర్ విషయం తేల్చకపోవడానికి కారణం ఇదే కావచ్చని అంటున్నారు. ఇందుకే.. దర్శకుడు మోహన్ రాజా.. నయన తార పేరును ప్రకటించలేదని తెలుస్తోంది. మరి, నయన్ ఎంట్రీ ఇస్తుందా? లేక మరెవరైనా రీప్లేస్ చేస్తారా? అన్నది చూడాలి.
లూసీఫర్ చిత్రానికి రీమేక్ స్పెషలిస్ట్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. సినిమా సెట్స్ మీదకు వెళ్లే టైం దగ్గరపడుతున్నప్పటికీ.. హీరోయిన్ ఎవరనేది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతారను అనుకుంటున్న విషయం తెలిసిందే. కానీ.. అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.
లూసీఫర్ ఒరిజినల్లో మంజు వారియర్ పోషించిన పాత్రను నయనతార టేకేవర్ చేస్తుందనే ప్రచారం జరిగింది. దాదాపు కన్ఫామ్ అయ్యిందని కూడా వార్తలు వచ్చాయి. కానీ.. మేకర్స్ ఇంకా నయనతార పేరును ప్రకటించలేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. మేకర్స్ నయన్ ను సంప్రదించారట. కానీ.. ఏ విషయమైందీ ఆమె చెప్పలేదట.
లూసీఫర్ విషయంలో నయనతార 'నో' చెప్పలేదట. అలాగని 'ఎస్' అని కన్ఫామ్ కూడా చేయలేదట. దీనికి.. కారణం ఏమై ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది. అయితే.. ప్రియుడు విఘ్నేష్ శివన్తో నయనతార వివాహం జరగబోతోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నయనతార లూసీఫర్ విషయం తేల్చకపోవడానికి కారణం ఇదే కావచ్చని అంటున్నారు. ఇందుకే.. దర్శకుడు మోహన్ రాజా.. నయన తార పేరును ప్రకటించలేదని తెలుస్తోంది. మరి, నయన్ ఎంట్రీ ఇస్తుందా? లేక మరెవరైనా రీప్లేస్ చేస్తారా? అన్నది చూడాలి.