Begin typing your search above and press return to search.

రావిపూడిని క‌లిసిన చెర్రీ మేనేజ‌ర్.. అందుకేనా?

By:  Tupaki Desk   |   24 Jan 2021 2:50 PM GMT
రావిపూడిని క‌లిసిన చెర్రీ మేనేజ‌ర్.. అందుకేనా?
X
ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆర్ ఆర్ ఆర్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు.. ఆచార్యలోనూ స్పెష‌ల్ రోల్ చేస్తున్నాడు. ఇవి రెండు సినిమాల షూట్ చివ‌రి ద‌శ‌లో ఉంది. మ‌రి వీటి త‌ర్వాత చెర్రీ ఏం సినిమా చేయ‌బోతున్నాడు? అనే ప్ర‌శ్న ఎంతో కాలంగా కొన‌సాగుతోంది. కానీ.. ఆన్స‌ర్ మాత్రం దొర‌క‌లేదు.

ఈ గ్యాప్ లో చెర్రీ చాలా క‌థ‌లు విన్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ.. ఏదీ ఫైన‌ల్ కాలేదు. అయితే.. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చెర్రీ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత త‌మిళ్ డైరెక్ట‌ర్‌ లోకేష్ కనగరాజ్ తో మూవీని లైన్లో పెట్టాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ.. మాస్టర్ లెక్క త‌ప్ప‌డంతో అది కూడా డౌటే అని తేలిపోయింది.

అయితే.. లేటెస్ట్ అప్డేట్ కొత్త అంచ‌నాల‌కు అవ‌కాశ‌మిచ్చింది. రామ్ చ‌ర‌ణ్‌ మేనేజ‌ర్ ప్రవీణ్ ఇటీవల క్రేజీ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడిని క‌లిసిన‌ట్టు స‌మాచారం. అనిల్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ‘గాలి సంపత్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకోసం సారధి స్టూడియోలో ఉన్న అనిల్ ను.. ప్రవీణ్ కలిశాడని తెలుస్తోంది.

ప్రస్తుతం అనిల్ ఎఫ్-3 మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఈ ఏడాది సెకండ్ ఆఫ్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రామ్ చరణ్ కూడా ఆర్ ఆర్ ఆర్, ఆచార్య చిత్రాల‌ను ముగించుకొని ఫ్రీ అయిపోతాడు. సో.. ఆ త‌ర్వాత వీరిద్ద‌రి సినిమా మొద‌లు కాబోతోంద‌ని స‌మాచారం. ఈ విష‌యం చ‌ర్చించేందుకే ప్ర‌వీణ్‌.. అనిల్ ను క‌లిశాడ‌నే ప్ర‌చారం సాగుతోంది. మ‌రి, ఇది నిజ‌మేనా? చెర్రీతో అనిల్ మూవీ ఉంటుందా? లేదా? అనేది చూడాలి.