Begin typing your search above and press return to search.

నాని - దిల్ రాజుల మధ్య చర్చ.. అసలు మూ'వీ' సంగతేంటి?

By:  Tupaki Desk   |   13 Aug 2020 8:30 AM GMT
నాని - దిల్ రాజుల మధ్య చర్చ.. అసలు మూవీ సంగతేంటి?
X
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కొత్త సినిమా 'వి'. క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నివేద థామస్, అతిథి రావు హైదరిలు హీరోయిన్లుగా నటించారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని విలన్ పాత్ర చేయడం విశేషం. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసరుగా కనిపించనున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఉగాదికే విడుదల కావాల్సిన సినిమా ఇంతవరకు విడుదల కాలేదు. దేశం మొత్తం థియేటర్లు మూసివేయడంతో కొత్త సినిమాలన్నీ మూలన పడ్డాయి. థియేటర్లు తిరిగి ఓపెన్ అయితే గాని విడుదలయ్యేలా కన్పించడం లేదు. ఇక లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఓటిటిలే ఎంటర్టైన్మెంట్ కోసం పెద్ద దిక్కులా మారాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దొరికిన సినిమాలన్నింటిని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ బేరం కుదుర్చుకొని ఓటిటిలో ప్రదర్శిస్తున్నాయి.

అలా ఓటిటిల బేరం వరకు వెళ్లి థియేటర్లోనే విడుదల చేస్తామన్న సినిమా వి. ఈ సినిమా మేకింగ్ అప్పుడే చాలా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ట్రైలర్ విడుదలయ్యాక ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా నిర్మాత దిల్ రాజు సినిమాను ఓటిటిలో విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడట. ఎందుకంటే థియేటర్లు ఓపెన్ అయ్యేలోపు ప్రేక్షకులు సినిమాను మర్చిపోతారని అనుకుంటున్నాడట. అయితే ఇదివరకు నానితో మాట్లాడితే వెయిట్ చేద్దాం అని చెప్పాడట. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే కుదిరేలా లేదని దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్లతో సంప్రదింపులు జరిపితే వారు కూడా డిజిటల్ విడుదల బెటర్ అని అన్నారట. ఇక మళ్లీ ఇటీవలే నానితో ప్రస్తుత పరిస్థితులు వివరించాడట. ఇద్దరి మధ్య చర్చలు ముగిసింది. మొత్తానికి నాని ఓటిటి విడుదలకు సానుకూలంగా స్పందించి తప్పుకున్నాడట. ఇక దిల్ రాజు 'వి' సినిమాకు అమెజాన్ ప్రైమ్ నుండి భారీమొత్తంలోనే లాగినట్లు సమాచారం. ఇక ఎన్నో అంచనాల మధ్య వి సినిమా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుందని తెలుస్తుంది.