Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రిలో ఈ సారి పై చేయి సాధించేది ఎవ‌రు?

By:  Tupaki Desk   |   25 Nov 2022 1:30 AM GMT
ఆ ఇద్ద‌రిలో ఈ సారి పై చేయి సాధించేది ఎవ‌రు?
X
2020 సంక్రాంతి బ‌రిలో అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` విడుద‌లైంది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేశారు. `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` వంటి డిజాస్ట‌ర్ త‌రువాత బ‌న్నీ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఇది అల్లు అర్జున్ కు అత్యంత కీల‌కంగా మారింది. ఈ మూవీకి త‌మ‌న్ సంగీతం అందించాడు. త్రివిక్ర‌మ్ మ్యాజిక్‌, బ‌న్నీ స్టైల్‌.. త‌మ‌న్ మ్యాజిక‌ల్ మ్యూజిక్ ఈ మూవీని ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిపాయి.

ఒక విధంగా చెప్పాలంటే త‌మ‌న్ అందించిన సంగీత‌మే ఈ మూవీని సంక్రాంతి విజేత‌గా నిలిపి హ్యూజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించింది. ఇక ఈ సినిమా రిలీజ్ కు ఒక్క రోజు ముందు అంటే జ‌న‌వ‌రి 11న సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` విడుద‌లైంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ ఊవీకి దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించాడు. సినిమా ప‌రంగా, సంగీతం ప‌రంగా `అల వైకుంఠ‌పుర‌ములో` మూవీ ముందే తేలిపోయింది.

2020 సంక్రాంతి రేసులో నిజం చెప్పాలంటే దేవిశ్రీ‌ప్ర‌సాద్ కార‌ణంగా `స‌రిలేరు నీకెవ్వ‌రు` చేతులెత్తేసింది. అంటే దేవి కంటే త‌మ‌న్ ఈ సంక్రాంతి రేసులో పై చేయి సాధించాడ‌న్న‌మాట‌. స‌రిగ్గా మూడేళ్ల త‌రువాత అంటే 2023 సంక్రాంతి బ‌రిలో మ‌ళ్లీ త‌మ‌న్‌, దేవిశ్రీ‌ప్ర‌సాద్ పోటీప‌డ‌బోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న `వాల్తేరు వీర‌య్య‌`కు దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌గా, నంద‌యూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న మాసీవ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `వీర సింహారెడ్డి`కి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

`వాల్తేరు వీర‌య్య‌`కు బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, `వీర సింహారెడ్డి`కి గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ ఇద్ద‌రు మాస్ డైరెక్ట‌ర్లే. దీంతో ఈ రెండు సినిమాల భారం అంతా సంగీత ద‌ర్శ‌కులు దేవి, త‌మ‌న్ ల‌పై ప‌డింది. 2020 సంక్రాంతి బ‌రిలో త‌మ‌న్ పై చేయి సాధించి త‌న‌దైన మార్కు ఆల్బ‌మ్ తో బన్నీకి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని అందించాడు. దేవి మాత్రం వెన‌బ‌డిపోయాడు. అయితే 2023 సంక్రాంతి స‌మ‌రం ఇప్ప‌డు వీరిద్ద‌రి మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర స‌మ‌రానికి తెర తీసింది.

ఇప్ప‌టికు దేవి సంగీతం అందించిన `వాల్తేరు వీర‌య్య‌` నుంచి బాస్ పార్టీ అంటూ ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది. ముందు ప్ర‌మోపై కామెంట్ లు వినిపించినా క్ర‌మ క్ర‌మంగా పాట ఆక‌ట్టుకుంటూ నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే అనుకున్న రేంజ్ లో మాత్రం పాట లేక‌పోవ‌డంతో స్లోగా క‌నెక్ట్ అవుతోంది. ఈ నేప‌థ్యంలో త‌మ‌న్ సంగీతం అందిస్తున్న `వీర సింహారెడ్డి` నుంచి కూడా ఈ 25న ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ గా `రాజ‌సం నీ పేరు` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేయ‌బోతున్నారు.

బాస్ పార్టీకి మించి ఈ పాట వుంటే దేవి ఈ సంక్రాంతి రేసులో మ‌రోసారి వెన‌క‌బ‌డిన‌ట్టేన‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఏం జ‌ర‌గ‌నుండో తెలియాలంటే శుక్ర‌వారం ఉద‌యం 10:29 నిమిషాల వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.