Begin typing your search above and press return to search.

'సూపర్ స్టార్'ని ఫాలో అవుతున్న మరో సూపర్ స్టార్!

By:  Tupaki Desk   |   18 Jun 2020 3:30 AM GMT
సూపర్ స్టార్ని ఫాలో అవుతున్న మరో సూపర్ స్టార్!
X
ఇండియన్ సినీ చరిత్రలో స్టైల్ కి పెట్టింది పేరు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన చెప్పే డైలాగ్స్.. ఫైట్స్.. యాక్షన్ ఇలా అన్నింటిలో ఓ స్టైల్ ఉంటుంది. ఈ సూపర్ స్టార్ నాటి హీరోల నుండి నేటి యంగ్ హీరోలకు సైతం పోటీగా నిలుస్తూ వస్తున్నాడు. రజినీ సినిమా అంటేనే సినీ ప్రేక్షకులు ఎగిరి గంతేస్తారు. స్టైలుతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఘనత ఆయనకే దక్కింది. ఈ ఏడాది 'దర్బార్' సినిమా విజయంతో ఊపులో ఉన్న రజిని ప్రస్తుతం 'శంఖం' ఫేమ్ శివ దర్శకత్వంలో 'అణ్ణాత్తే' సినిమాను చేస్తున్నాడు. అయితే సూపర్ స్టార్ రజినీ.. ఓ విషయంలో టాలీవుడ్ సూపర్ స్టార్ ని ఫాలో అవుతున్నాడట. అదేంటంటే.. 2019లో సంక్రాంతికి రజనీ నటించిన 'పేట' సినిమా విడుదల అయింది. అలాగే 2020లో అదే సంక్రాంతిని టార్గెట్ చేసుకుని తన 'దర్బార్' సినిమా విడుదలైంది. అదీగాక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'అణ్ణాత్తే' సినిమాను కూడా వచ్చే ఏడాది అంటే 2021 సంక్రాంతికే విడుదల చేయాలనీ టార్గెట్ చేశారట. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న రానుందని సమాచారం.

మరి ఇందులో మహేష్ ని ఫాలో అయ్యింది ఏముంది.. అంటే 2012 సంక్రాంతి పండగను గుర్తు చేసుకోవాల్సిందే. ఏడేళ్ళ క్రితం మహేశ్ ఎలాగైతే మూడేళ్ళ పాటు సంక్రాంతిని టార్గెట్ చేసుకుని తన వరుస సినిమాలతో పలకరించాడో.. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అదే బాటలో వెళ్తున్నాడు. గతంలో మూడేళ్ళ పాటు సంక్రాంతినే టార్గెట్ చేసుకుని వరుస సినిమాలతో సందడి చేశాడు మహేశ్. 2012 సంక్రాంతికి 'బిజినెస్‌మేన్' సినిమాతో జనం ముందుకు వచ్చిన మహేష్.. 2013లో మళ్లీ సంక్రాంతి పండగనే లక్ష్యంగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో వచ్చాడు. అంతటితో ఆగకుండా మళ్లీ 2014 సంక్రాంతి పర్వదినాన్ని టార్గెట్ చేసుకుని '1-నేనొక్కడినే' అంటూ సందడి చేసాడు మహేష్. ఒక విధంగా ఓ హీరో మూడు వరుస సినిమాలు సంక్రాంతి సీజన్‌ని టార్గెట్ గా రిలీజ్ కావడం అరుదైన విషయం. మహేశ్ విషయంలో ఏడు సంవత్సరాల క్రితం జరిగిన వ్యవహారమే.. మళ్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో రిపీట్ అవుతుండడం విశేషం. ఇద్దరు సూపర్ స్టార్ల అభిమానులు నెట్టింట ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి రజినీ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.