Begin typing your search above and press return to search.

రెండేళ్లు వృథా అని క‌ల‌తకు గురైన‌ స్టార్ డైరెక్ట‌ర్!

By:  Tupaki Desk   |   2 July 2020 7:53 AM GMT
రెండేళ్లు వృథా అని క‌ల‌తకు గురైన‌ స్టార్ డైరెక్ట‌ర్!
X
మ‌హ‌మ్మారీ త‌ల‌రాతలు మార్చేసింది. ఎవ‌రు ఎలా ఉండాలో డిసైడ్ చేసింది. ఎంత‌టివారికైనా ముకుతాడు వేయ‌డ‌మెలానో పాఠం నేర్పింది. సాక్షాత్తూ మెగా హీరోలే త‌మ‌లో తాము ఆలోచించుకునేలా మ‌ద‌న‌ప‌డేలా వైర‌స్ ఆడిన ఆట మామూలుగా లేదు. వంద‌ల కోట్ల బ‌డ్జెట్ల‌తో సినిమాల్ని పూర్తి చేయాల్సి ఉండ‌గా పిడుగులా మీద ప‌డింది మ‌హ‌మ్మారీ. తాజా స‌న్నివేశం కేవ‌లం మెగా హీరోల‌కే కాదు.. ద‌ర్శ‌కుల‌కు చిక్కుల్ని తెచ్చి పెడుతోంది.

ఓవైపు ఆచార్య చిత్రీక‌ర‌ణ కోసం కొర‌టాల శివ రెండేళ్లుగా వేచి చూస్తున్నాడు. ఇన్నాళ్లు స్క్రిప్టు ప్రీప్రొడక్ష‌‌న్ ప‌నుల‌తో బిజీ. అంతా సిద్ధం అనుకుంటుండ‌గానే మ‌హ‌మ్మారీ పంచ్ వేసింది. ఈ దెబ్బ‌కు ఆర్.ఆర్.ఆర్ లో త‌న పాత్ర చిత్ర‌ణ పూర్తి కాక‌పోవ‌డంతో చ‌ర‌ణ్ కి ఇబ్బంది త‌లెత్తింది. ఆచార్య‌కు కేటాయించిన కాల్షీట్ల‌ను అనుకున్న‌ట్టే వినియోగించ‌‌డం కుద‌ర‌లేదు. దీంతో కొర‌టాల ఎంత‌గానో క‌ల‌త చెందుతున్నార‌ట‌. రెండేళ్ల పాటు వేచి చూశాన‌ని త‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నార‌ట‌. అయినా ఏం చేస్తారు? అంతా మ‌హ‌మ్మారీ మాయ‌. ఇటు చ‌ర‌ణ్ ని కానీ.. అటు చిరుని కానీ.. జ‌క్క‌న్న‌ను కానీ అన‌లేని ప‌రిస్థితి. ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ వేగంగా పూర్తి చేయాల‌ని రాజ‌మౌళి కూడా భావిస్తున్నా ప‌రిస్థితులే అనుకూలంగా లేవు.

ఆ క్ర‌మంలోనే చిరు నేరుగా రాజ‌మౌళితో మాట్లాడార‌ని ప్ర‌చార‌మైంది. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా చ‌ర‌ణ్ కాల్షీట్ల వ్య‌వ‌హారంపై తేలుస్తాన‌ని మాటివ్వ‌డంతో చిరు వేచి చూస్తున్నారు. చిరు- చ‌ర‌ణ్ రాక‌కోసం అంతే ఆత్రంగా కొర‌టాల వేచి చూస్తున్నార‌ట‌. తండ్రి కొడుకులు సెట్స్ లో జాయిన్ అయితే త‌న ప‌నిని వేగంగా పూర్తి చేయాల‌న్న‌ది కొర‌టాల ఆత్రం. అయితే ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ మ్యాట‌ర్ త్వ‌ర‌గా తేలేట్టు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఇక చర‌ణ్ స్వ‌యంగా ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుని ఆచార్య‌కు లైన్ క్లియ‌ర్ చేస్తేనే మేలు అని సూచిస్తున్నారు కొంద‌రు.

ఎలానూ ఆర్.ఆర్.ఆర్ 2021 సెకండాఫ్ లోనే రిలీజ‌య్యేది. కానీ ఆచార్య అంత‌కుముందే రావాల్సి ఉంటుంది. ఆచార్య రిలీజ్ తేదీపై క్లారిటీ రావాల‌న్నా ఎప్ప‌టికి పూర్త‌వుతుంది? చ‌ర‌ణ్ కాల్షీట్లు ఎప్ప‌టికి సాధ్యం? అన్న‌దానిపైనా క్లారిటీ రావాల్సి ఉంటుంది.

చిరు కోసం కొర‌టాల ఎంతో చేశాడు. రెండేళ్లు వేచి చూశాడు. చిరు కోరితేనే చ‌ర‌ణ్ కోసం ఆ రోల్ రాశాడు. చ‌ర‌ణ్ కి కుద‌ర‌దు అంటే మ‌హేష్ ని సంప్ర‌దించాడు. ఇప్పుడు మ‌హేష్ కి కుద‌ర‌క‌పోతే చ‌ర‌ణ్ వ‌స్తాడ‌నే హోప్ తో ఉన్నాడు. ఇంత వెయిటింగ్ అంటే భ‌రించ‌లేనిదే. మొత్తానికి కొర‌టాల క‌ల‌త‌ను గ్ర‌హించి నేరుగా మెగా బాస్ అన్నిటినీ స‌మ‌న్వ‌యం చేస్తున్నార‌ట‌. స్వ‌యంగా ప‌రిష్కారం వెతుకుతున్నార‌ని చెబుతున్నారు.