Begin typing your search above and press return to search.
శంకర్ వర్సెస్ లైకా పంతం వీడక చెర్రీకి చిక్కులు!
By: Tupaki Desk | 17 Jun 2021 1:30 PM GMTరామ్ చరణ్-శంకర్ చిత్రం ఆలస్యం అవుతుందా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. శంకర్ వర్సెస్ లైకా పంతం ఇప్పట్లో వీడేట్టు లేరు. భారతీయుడు 2 గొడవ ఇంకా ముదురుతోందే కానీ తగ్గడం లేదు. దీంతో ఇది చెర్రీ స్పీడ్ కి బ్రేకులు వేస్తోంది.
లైకాతో శంకర్ కోర్టు వెలుపల పరిష్కారానికి అంగీకరించినా కానీ చర్చలు విఫలమైనందున లైకా మరోసారి కోర్టును ఆశ్రయించింది. ఈ రోజు కోర్టు విచారణను మరో మూడు వారాల పాటు వాయిదా వేసింది. దీంతో ఈ చిత్రం మరింత ఆలస్యం అవుతుంది. తన ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందో లేదో తెలుసుకోవటానికి రామ్ చరణ్ కు మరో మూడు వారాలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది.
RRR తర్వాత శంకర్ సినిమా చేస్తారు. ఆ తర్వాతా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్-ఇండియన్ సినిమాలు చేస్తూనే ఉంటారు. శంకర్ దర్శకత్వంలో పాన్-ఇండియన్ చిత్రాన్ని ఇంతకుముందే నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు. స్క్రిప్ట్ సిద్ధం. ప్రస్తుతం శంకర్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. రామ్ చరణ్ చిత్రం షూట్ ఆగస్టు నుండి ప్రారంభించడానికి శంకర్ ఆసక్తిగా ఉన్నాడు. తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ ఆగస్టు మిడిల్ లో ఈ చిత్రం సెట్స్ లో చేరాల్సి ఉంది. ఇతర నటీనటులను శంకర్ ఖరారు చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తారు. అత్యంత భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2022 ద్వితీయార్థంలో థియేటర్లలో రిలీజ్ చేయాలన్నది ప్లాన్. కానీ లైకా ప్రొడక్షన్స్ తో శంకర్ చట్టపరమైన వివాదం సద్ధుమణగకపోవడం ఇబ్బందికరంగా మారింది.
లైకాతో శంకర్ కోర్టు వెలుపల పరిష్కారానికి అంగీకరించినా కానీ చర్చలు విఫలమైనందున లైకా మరోసారి కోర్టును ఆశ్రయించింది. ఈ రోజు కోర్టు విచారణను మరో మూడు వారాల పాటు వాయిదా వేసింది. దీంతో ఈ చిత్రం మరింత ఆలస్యం అవుతుంది. తన ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందో లేదో తెలుసుకోవటానికి రామ్ చరణ్ కు మరో మూడు వారాలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది.
RRR తర్వాత శంకర్ సినిమా చేస్తారు. ఆ తర్వాతా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్-ఇండియన్ సినిమాలు చేస్తూనే ఉంటారు. శంకర్ దర్శకత్వంలో పాన్-ఇండియన్ చిత్రాన్ని ఇంతకుముందే నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు. స్క్రిప్ట్ సిద్ధం. ప్రస్తుతం శంకర్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. రామ్ చరణ్ చిత్రం షూట్ ఆగస్టు నుండి ప్రారంభించడానికి శంకర్ ఆసక్తిగా ఉన్నాడు. తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ ఆగస్టు మిడిల్ లో ఈ చిత్రం సెట్స్ లో చేరాల్సి ఉంది. ఇతర నటీనటులను శంకర్ ఖరారు చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తారు. అత్యంత భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2022 ద్వితీయార్థంలో థియేటర్లలో రిలీజ్ చేయాలన్నది ప్లాన్. కానీ లైకా ప్రొడక్షన్స్ తో శంకర్ చట్టపరమైన వివాదం సద్ధుమణగకపోవడం ఇబ్బందికరంగా మారింది.