Begin typing your search above and press return to search.

'సర్కారు వారి..' పాటల రైట్స్ ఎవరికంటే..!

By:  Tupaki Desk   |   30 July 2021 9:52 AM GMT
సర్కారు వారి.. పాటల రైట్స్ ఎవరికంటే..!
X
'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''సర్కారు వారి పాట''. పరశురామ్‌ పెట్లా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్‌ పోస్టర్‌ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. కేవలం ప్రీ లుక్ తోనే బజ్ క్రియేట్ చేసిన 'సర్కారు వారి..' సినిమా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోంది. శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ టెలివిజన్ ఛానల్ 'స్టార్ మా' వారు ఫ్యాన్సీ రేట్ కు దక్కించుకున్నారు. ఇదే క్రమంలో ఆడియో హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

'సర్కారు వారి పాట' చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ ని పాపులర్ ఆడియో లేబుల్ కంపెనీ సరిగమ సౌత్ వారు తీసుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. మహేష్ గత చిత్రాలు.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఫార్మ్ ని పరిగణలోకి తీసుకుని ఆడియో రైట్స్ మంచి ధర పలికినట్లు తెలుస్తోంది. 'దూకుడు' 'బిజినెస్ మ్యాన్' 'ఆగడు' సినిమాల తర్వాత మహేష్ బాబు - ఎస్ ఎస్ థమన్ చార్ట్ బస్టర్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇకపోతే ‘సర్కారు వారి పాట’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రేపు (జూలై 31) విడుదల చేయనున్నారు. ఫస్ట్‌ నోటీస్‌ పేరుతో రానున్న మహేశ్‌ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్యాంక్ స్కాముల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ ఇప్పటి వరకూ కనిపించని కొత్త లుక్‌ లో దర్శనమివ్వనున్నారు. సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న ఓ గ్లిమ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ - జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ - 14 రీల్స్ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుబాయ్‌ లో భారీ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.