Begin typing your search above and press return to search.

ఇండియాస్‌ బెస్ట్ డైరెక్టర్‌.. సూపర్‌ స్టార్‌ కాంబోలో సినిమా కన్ఫర్మ్‌

By:  Tupaki Desk   |   26 July 2021 6:45 AM GMT
ఇండియాస్‌ బెస్ట్ డైరెక్టర్‌.. సూపర్‌ స్టార్‌ కాంబోలో సినిమా కన్ఫర్మ్‌
X
ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పటికి నిలిచి పోయే సినిమాలు తీసిన దర్శక దిగ్గజాలు కొద్ది మంది మాత్రమే ఉంటారు. అందులో రాజ్ కుమార్‌ హిరానీ ఒకరు అనడంలో సందేహం లేదు. ఆయన సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా 20 ఏళ్లు అవుతుంది. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలు అయిదు మాత్రమే. అయినా కూడా ఆయన గొప్ప దర్శకుడిగా పేరు దక్కించుకున్నారు. ఆయన సినిమాలో సందేశంతో పాటు వినోదం కూడా ఉంటుంది. అలా కొద్ది మంది మాత్రమే సినిమాలు తీయగలరు.

సందేశాత్మక సినిమాల విషయంలో ఆయన ఇండియాలోనే టాప్ దర్శకుల జాబితాలో ఉంటాడు అనడంలో సందేహం లేదు. అందుకే ఆయన నుండి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ఇండస్ట్రీ వర్గాల వారు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. హిందీలో ఈయన చివరగా సంజు సినిమాను చేశాడు. సినిమా సినిమాకు ఏళ్లకు ఏళ్ల గ్యాప్‌ తీసుకుంటూ ఉండే ఈ దర్శకుడు తదుపరి సినిమాను బాలీవుడ్‌ బాద్‌ షా సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ తో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జీరో సినిమా తర్వాత షారుఖ్‌ ఖాన్‌ చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. గడచిన పదేళ్ల కాలంలో షారుఖ్‌ ఖాన్‌ సినిమాల ఫరంగా సక్సెస్ ను దక్కించుకున్నది లేదు.

ప్రస్తుతం పఠాన్‌ సినిమాను చేస్తున్న షారుఖ్‌ ఆ తర్వాత అట్లీ కుమార్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో రాజ్‌ కుమార్‌ హిరానీ దర్శకత్వంలో కూడ ఒక సినిమాను ఆయన చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. పెద్ద ఎత్తున అంచనాలున్న వీరి కాంబోలో సినిమా కోసం ప్రేక్షకులు సుదీర్ఘ కాలంగా వెయిట్‌ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని త్వరలో యూనిట్‌ సభ్యులు అధికారికంగా త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

ఇండియాస్ బెస్ట్‌ డైరెక్టర్‌ అయిన రాజ్‌ కుమార్‌ హిరానీ సినిమా అంటే దేశ వ్యాప్తంగా మంచి బజ్ ఉంటుంది. పైగా షారుఖ్‌ ఖాన్‌ మూవీ అవ్వడం వల్ల మరింతగా అంచనాలు ఉంటాయి. ఈమద్య కాలంలో భారీ బడ్జెట్‌ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. మరి రాజ్ కుమార్‌ హీరాని ఈసారి ఎలాంటి సినిమాను చేస్తాడు అనేది చూడాలి. పఠాన్ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో అతి త్వరలోనే షారుఖ్‌ తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు అట్లీ సినిమా గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

కథ ఓకే అయ్యింది.. స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. హీరోయిన్‌ గా నయనతారను ఎంపిక చేశారు అంటూ ప్రచారం జరిగింది. ఇంకా సినిమా గురించి కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ సమయంలోనే రాజ్‌ కుమార్‌ హిరానీ దర్శకత్వం లో షారుఖ్‌ మూవీ అంటూ ప్రచారం మొదలు అయ్యింది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది మొదటగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనేది చూడాలి.