Begin typing your search above and press return to search.

పోసానికి కరోనా పాజిటివ్‌.. మన్నించాలంటూ విజ్ఞప్తి

By:  Tupaki Desk   |   30 July 2021 5:30 AM GMT
పోసానికి కరోనా పాజిటివ్‌.. మన్నించాలంటూ విజ్ఞప్తి
X
ప్రముఖ నటుడు.. రచయిత అయిన పోసాని కృష్ణ మురళి కరోనా బారిన పడ్డారు. చూడ్డానికి గంభీర్యంగా కనిపించినా కూడా ఆయన మాటలు చేష్టలు అంతా చాలా విభిన్నంగా ఉంటాయి. పోసాని తనదైన మార్క్ తో ఎంటర్ టైన్మెంట్‌ ను పండిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును దక్కించుకున్నారు. అలాంటి పోసాని కరోనా బారిన పడ్డట్లుగా స్వయంగా తెలియజేయడంతో ఆయన శ్రేయోభిలాషులు.. ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సినీ ప్రముఖులు అభిమానులు అంతా కూడా ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు.

పోసాని కుటుంబ సభ్యులు మొత్తం కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యిందని.. లక్షణాలు కాస్త ఎక్కువగానే ఉండటం వల్ల హైదరాబాద్ లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో జాయిన్‌ అయినట్లుగా తెలుస్తోంది. ఎప్పుడు చేతిలో పది సినిమాలతో బిజీగా ఉండే పోసాని కి కరోనా పాజిటివ్‌ అవ్వడం వల్ల పలు సినిమాలు షూటింగ్స్ క్యాన్సిల్‌ అవ్వబోతున్నాయి. రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకునే పోసాని ఆ తర్వాత షూటింగ్‌ లో జాయిన్‌ అవుతాడు.

పోసాని తనకు కరోనా పాజిటివ్ విషయాన్ని అధికారికంగా వెళ్లడించడంతో పాటు.. తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా వల్ల ఇప్పుడు రెండు పెద్ద సినిమాల షూటింగ్‌ లు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అందుకు నన్ను నిర్మాతలు మన్నించాలంటూ విజ్ఞప్తి చేశాడు. తన వల్ల షూటింగ్‌ లు ఆగిపోతుండటం చాలా బాధగా ఉందని కూడా పోసాని ఆవేదన వ్యక్తం చేశాడు. తనదైన మేనరిజంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్‌ గా ఎన్నో సినిమాల్లో నటించి.. నటిస్తూ.. నటించబోతున్న పోసాని గారు త్వరగా కోలుకుని మళ్లీ సినిమాలు చేయాలంటూ అభిమానులు మరియు సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. గెట్‌ వెల్‌ సూన్‌ పోసాని గారు.