Begin typing your search above and press return to search.

మారిన ప‌వ‌న్ ప్లాన్.. మ‌ళ్లీ స్టార్ డైరెక్ట‌ర్ కు షాక్‌

By:  Tupaki Desk   |   14 May 2022 2:30 PM GMT
మారిన ప‌వ‌న్ ప్లాన్.. మ‌ళ్లీ స్టార్ డైరెక్ట‌ర్ కు షాక్‌
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్లానింగ్ ఓ స్టార్ డైరెక్ట‌ర్ ను మ‌రోసారి షాక్ కు గురిచేసింది. చాలా రోజులుగా ప‌ట్టాలెక్కుతుంద‌ని ప‌వ‌న్ సినిమా కోసం ఎదురుచూసిన స్టార్ డైరెక్ట‌ర్ కు ప‌వ‌న్ త‌న కొత్త నిర్ణ‌యంతో మ‌ళ్లీ షాకిచ్చాడు. వివ‌రాల్లోకి వెళితే.. ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024 వ‌ర‌కు త‌ను అంగీక‌రించిన ప్రాజెక్ట్ ల‌ని పూర్తి చేసి జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ కి వెళ్లాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సారి ఎలాగైనా ఎన్న‌క‌ల్లో జ‌న‌సేన పార్టీ స‌త్తా చూపించాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇందులో భాగంగానే బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ని ప‌ట్టాలెక్కించేసి రాకెట్ స్పీడుతో పూర్తి చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం క్రిష్ జాగ‌ర్ల‌మూడి డైరెక్ష‌న్ లో రూపొందుతున్న పీరియాడిక‌ల్ మూవీ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` చిత్రంలో న‌టిస్తున్నారు. 17వ శ‌తాబ్దం లోని మొఘ‌ల్ సామ్రాజ్యం నేప‌థ్యంలో సాగే క‌థ‌గా ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఏ.ఎం. ర‌త్నం.. ఏ . దయాక‌ర్ రావుతో క‌లిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

`బంగారం` త‌రువాత కొన్నేళ్ల విరామం అనంత‌రం ప‌వ‌న్ తో ఏ.ఎం. ర‌త్నం చేస్తున్న సినిమా ఇది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కోవిడ్ కు ముందే షూటింగ్ మొద‌లైనా ఈ మూవీ అనేక కార‌ణాల వ‌ల్ల ఆగుతూ స్టార్ట‌వుతూ.. మ‌ళ్లీ ఆగుతూ .. మొద‌ల‌వుతూ వ‌స్తోంది. ఈ సినిమాని ప‌క్క‌న పెట్టి ఇటీవ‌ల ప‌వ‌న్ `భీమ్లానాయ‌క్‌`ని పూర్తి చేసి రిలీజ్ కూడా చేశారు. కానీ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` మాత్రం పూర్తి కావ‌డం లేదు. ఎట్ట‌కేల‌కు ఇటీవ‌ల షూటింగ్ మొద‌లైంది. మ‌ళ్లీ గ్యాప్ ఇచ్చారు. మే 14 నుంచి మ‌ళ్లీ మొద‌లు పెట్టారు.

ఇటీవ‌లే ఈ చిత్రానికి సంబంధించిన విజువ‌ల్ ఎఫెక్ట్స్ షాట్స్ ని పూర్తి చేశారు. ప్ర‌స్తుతం ప‌లు కీల‌క ఘ‌ట్టాల షూటింగ్ మొద‌లైంది. ఈ చిత్రాన్ని త్వ‌ర‌గా పూర్తి చేసి ప‌వ‌న్ మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించ‌బోతున్నారు. ముందు అనుకున్న ప్ర‌కారం ఈ మూవీ త‌రువాత స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ రూపొందించ‌నున్న `భ‌వ‌దీరుడు భ‌గ‌త్ సింగ్‌`ని ప‌ట్టాలెక్కించాల‌నుకున్నారు. కానీ ఆ ప్లాన్ ని ప‌వ‌న్ మార్చేశారు. ఈ సినిమా ప్లేస్ లో త‌మిళ రీమేక్ మూవీని స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేశార‌ట ప‌వ‌న్‌. ఇదే ఇప్ప‌డు హ‌రీష్ శంక‌ర్ కు షాకిచ్చింద‌ని అంటున్నారు.

`హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మిళ హిట్ ఫిల్మ్ `వినోదాయ సితం` రీమేక్ లో న‌టించ‌బోతున్నారు. స‌ముద్ర ఖ‌ని డైరెక్ట్ చేయ‌నున్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కీల‌క పాత్ర‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించ‌నున్న ఈ మూవీ కోసం ప‌వ‌న్ ఏకంగా 40 రోజులు కేటాయించ‌బోతున్నార‌ట‌. ఇందులో ప‌వ‌న్ `గోపాల గోపాల‌` త‌ర‌హాలో గాడ్ గా మ‌రోసారి క‌నిపించ‌బోతున్నారు. దీని త‌రువాతే హ‌రీష్ శంక‌ర్ `భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌`లో ప‌వ‌న్ న‌టిస్తార‌ట‌.