Begin typing your search above and press return to search.

పిక్ టాక్: పక్కా కమర్షియల్ జోడీ దసరా స్పెషల్..!

By:  Tupaki Desk   |   15 Oct 2021 10:55 AM GMT
పిక్ టాక్: పక్కా కమర్షియల్ జోడీ దసరా స్పెషల్..!
X
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ''పక్కా కమర్షియల్''. ఇందులో గ్లామరస్ క్వీన్ రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపిస్తుండగా.. రాశీ ఓ సీరియల్ స్టార్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మారుతి గత చిత్రాల తరహాలోనే ఈ చిత్రాన్ని కమర్షియల్ పంథాలో సాగే కామెడీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు.

నేడు విజయదశమి పండుగను పురస్కరించుకుని 'పక్కా కమర్షియల్' చిత్ర బృందం ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్న గోపీచంద్ - రాశీ ఖన్నా జోడీ ఆకట్టుకుంటోంది. వైట్ షర్ట్ ధరించి లాయర్ గెటప్ లో ఉన్న గోపీచంద్ నవ్వులు చిందిస్తుండగా.. పక్కనే ఉన్న రాశీ తన భుజంపై నల్ల కోటు వేసుకొని అతని వైపు సీరియస్ గా చూస్తోంది. 'జిల్' సినిమా తర్వాత గోపీ - రాశీ జంట 'పక్కా కమర్షియల్' సినిమాతో మరోసారి అలరించబోతున్నారని అర్థం అవుతోంది. మరి ఇద్దరికీ ఈ సినిమా కమర్షియల్ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

'పక్కా కమర్షియల్' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు జీఏ2 సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. బన్నీ వాస్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జేక్స్ బిజోయ్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తుండగా.. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా.. బాబు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

అక్టోబర్ 1న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలోనే తదుపరి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. 'సీటీమార్' సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన గోపీచంద్.. ఇప్పుడు మారుతి తో కలిసి చేస్తున్న ''పక్కా కమర్షియల్'' చిత్రంతో మరో సక్సెస్ అందుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.