Begin typing your search above and press return to search.

స్వ‌యంవ‌రంలో ఆ ముగ్గురు హీరోలను కోరుకుంది!

By:  Tupaki Desk   |   18 Aug 2022 2:30 AM GMT
స్వ‌యంవ‌రంలో ఆ ముగ్గురు హీరోలను కోరుకుంది!
X
యాధృచ్ఛికంగా అయినా కానీ సీతాదేవి పాత్ర‌లో న‌టిస్తున్న కృతి స‌నోన్ త‌న స్వ‌యంవ‌రం ఎలా ఉండాలో వెల్ల‌డించింది. ఈ భామ త‌న‌దైన‌ అద్భుత నటనతో ఇండస్ట్రీలో తనేంటో నిరూపించుకుంది. 1 నేనొక్క‌డినే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై న‌టిగా నిరూపించుకుంది.

మహమ్మారి కారణంగా OTTలో వ‌చ్చిన‌ `మిమీ` ప్రేక్షకులు విమర్శకుల నుండి విపరీతమైన ప్ర‌శంస‌లు అందుకుంది. సినిమా ఆద్యంతం తనదైన‌ ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో కృతి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

`రోపోసో ఫర్ వానిటీ ఎఫైర్` షో లైవ్ సెషన్ లో కృతి తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ షోలో కృతిని తన స్వయంవరంలో ఏ హీరోని కోరుకుంటారు? అని ప్ర‌శ్నించ‌గా.. తన స్వయంవరంలో విజయ్ దేవరకొండ- కార్తీక్ ఆర్యన్- ఆదిత్య రాయ్ కపూర్ లు కావాలని వెంట‌నే త‌డుముకోకుండా జ‌వాబిచ్చింది. ఈ ముగ్గురే కాకుండా హాలీవుడ్ నటుడు ర్యాన్ గోస్లింగ్ కూడా ఈ జాబితాలో ఉండాలని ఆమె కోరింది.

విజయ్ దేవ‌ర‌కొండ‌ని ఇంటర్వ్యూలలో గమనిస్తున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తాడని.. అది క‌నెక్టింగ్ గా సెన్సిబుల్ గా అనిపించిందని చెప్పింది. కార్తీక్ ఆర్యన్ - ఆదిత్య రాయ్ కపూర్ లు కూడా మంచివారని గుర్తించింద‌ట‌. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. త‌దుప‌రి గణపత్ - అదిపురుష్ 3- షెహజాదా లాంటి భారీ చిత్రాలలో కనిపించ‌నుంది. ఆదిపురుష్ 3డిలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కృతి సీతాదేవి పాత్ర‌లో న‌టిస్తోంది.

రామాయ‌ణం ఆధారంగా రూపొందుతున్న‌ ఈ చిత్రానికి ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇది త‌న కెరీర్ కి భారీ పాన్ ఇండియా చిత్రం కావ‌డంతో మ‌బ్బుల్లో తేలుతోంది.